Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు 2014 సంవత్సరంలో గెలిచిన తర్వాత అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ప్రకటించారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే పరిపాలన రాజధానిగా అమరావతి ఆర్థిక రాజధానిగా వైజాగ్ న్యాయ రాజధానిగా కర్నూలు ప్రకటిస్తూ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఈసారి ఎన్నికలలో ఈయన గెలుపు పొందిన తర్వాత కచ్చితంగా మూడు రాజధానులను అమలులోకి తీసుకువస్తానని చెప్పగా ఈ ఎన్నికలలో వైసిపి ఘోర పరాజయం పాలు అయింది.
ఈ క్రమంలోనే చంద్రబాబునాయుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక విశాఖను ఆర్థిక ఆధునిక నగరంగా తయారు చేసుకుందామని తెలిపారు. అప్పటి సీఎం విశాఖను రాజధానిగా చేసుకుందామంటే నువ్వు మాకొద్దు అంటూ విశాఖపట్నం ప్రజా తీర్పు ఇచ్చారు. ఇక కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తానని చెప్పడంతో అక్కడ తనకు కొన్ని సీట్లు తక్కువ వస్తాయని భావించాను.
వైజాగ్ ఆర్థిక నగరం..
కర్నూలులో కూడా న్యాయ రాజధాని మాకొద్దు అంటూ ప్రజలందరూ కూడా కూటమికి మద్దతు తెలపడం సంతోషంగా ఉందని చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైజాగ్ ఆర్థిక నగరంగా తీర్చిదిద్దుకుందాం అంటూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైజాగ్ ఆర్థిక నగరంగా తీర్చిదిద్దుకుందాం అంటూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలపై నెటిజెన్స్ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.





























