AP Volunteer: ఏపీలో గత ప్రభుత్వం తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాలి. అయితే గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థను విమర్శించిన ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఎన్నికలలో అదే అస్త్రంగా భావించి విజయం సాధించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసివేయమని వారి పారితోషికం కూడా పదివేలకు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఎన్నికలలో గెలిచారు.

ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసే విషయంపై పలు మార్పులు కూడా చేశారని తెలుస్తోంది. గతంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేవారు కానీ ఇకపై ప్రతి గ్రామానికి కేవలం ఐదుగురు వాలంటీర్లు మాత్రమే ఉంటున్నారని సమాచారం.
వాలంటీర్లు కేవలం గ్రామస్థాయిలో మాత్రమే కాకుండా మండల స్థాయిలో కూడా విదులకు హాజరు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే వాలంటీర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ కూడా పూర్తి చేసి ఉండాలని తెలిపారు. అలాగే వాలంటీర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునే వాళ్ళు 1993 నుంచి 2004 మధ్య జన్మించిన వారై ఉండాలని వెల్లడించారు.
డిగ్రీ ఉత్తీర్ణత..
ఇక పింఛన్ పంపిణీ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం పింఛన్ దారులకు బ్యాంకు లోనే పెన్షన్ వేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే పద్ధతిని అనుసరించాలా లేకపోతే ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేయాల అనే విషయంపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ సిబ్బందులు వాలంటీర్లు కూడా సర్పంచుల కింద పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.





























