ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మాజి ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు ఏపీలో లాక్ డౌన్ అమలు చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి చెందుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. గత కరోనా వైరస్ కన్నా ఇది పదిరెట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని అయన అన్నారు.

ఓడిసాలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారని గుర్తు చేసారు. మరోవైపు పలు రాష్ట్రాలు పెద్దఎత్తున టీకాల కోసం ఆర్డలు పెట్టారని, కానీ ఏపీ సర్కార్ మాత్రం దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.


































