Chandra Babu Naidu: చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటూ పెద్ద ఎత్తున పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోని సిద్ధం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు రైతు భరోసా కింద 20,000 ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మకు వందనం అంటూ 15000 అలాగే 18 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి మహిళకు నేలకు 1500 రూపాయల డబ్బుతో పాటు నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా అందచేయబోతున్నట్లు మేనిఫెస్టో విడుదల చేశారు.

అయితే ఈ మేనిఫెస్టో విడుదల చేయాలి అంటే ఏడాదికి సుమారు 1,65 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది.ఇప్పటికీ అప్పులలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం నుంచి ఇంత డబ్బును ఎలా సంక్షేమానికి ఖర్చు చేస్తారో అనే ప్రశ్న ప్రతి సామాన్య వ్యక్తీ లోను కూడా కలుగుతుంది. అయితే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అందాలి అంటే చానా షరతులు వర్తిస్తాయి అంటూ రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి.
అమ్మకు వందనం అనే పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పిన బాబు వారందరూ కూడా ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివితే మాత్రమే వారికి ఈ పథకం వర్తిస్తుందని అలాగే వారికి తెల్ల రేషన్ కార్డు కూడా ఉండాలని కండిషన్లు పెట్టబోతున్నారట.
పథకాలకు ఇన్ని కండిషన్ల..
అలాగే ఇంట్లో ఎంతమందికి పాస్ బుక్కులు ఉన్న కేవలం ఒకరికి మాత్రమే రైతు భరోసా కింద 20 వేల రూపాయలు అందించబోతున్నారని సమాచారం. ఇలా ఈ కండిషన్ లన్ని బయటకు చెబితే ఓట్లు రావన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ కండిషన్ లను చెప్పకుండా కేవలం సంక్షేమాన్ని అందిస్తాము అంటూ మాయ మాటలను చెప్పి గెలిచిన తర్వాత లబ్ధిదారులను సగానికి సగం తొలగించేలా ప్లాన్ చేస్తున్నారంటూ పొలిటికల్ పరంగా చర్చలు జరుగుతున్నాయి.





























