Charmi kour : లైగర్ సినిమా ఆగస్టు లో భారీ అంచనాలు నడుమ విడుదలయి డిజాస్టర్ గా మిగిలింది. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చిన ఈ సినిమా ఫెయిల్యూర్ సినిమా టీం ను నిరుత్సాహ పరించింది. అయితే సినిమా పరాజయం గురించి నిర్మాత అయిన ఛార్మి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను మాట్లాడారు. లైగర్ సినిమా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ, ఛార్మి ల పీసీ కనెక్ట్స్ సంస్థ రెండు సయుక్తంగా నిర్మించాయి. సినిమా బాలీవుడ్ లోనూ అలాగే సౌత్ లోనూ భారీ అంచనాల నడుమ విడుదలయింది, అయితే సినిమా ఫెయిల్ అవడానికి కారణాలను ఛార్మి వివరించే ప్రయత్నం చేసింది.

వరుస తెలుగు సినిమాలు బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ వచ్చాయి… కానీ లైగర్…
లైగర్ సినిమాను 2020 లో మొదలు పెడితే 2022 కి థియేటర కి వచ్చింది. పెద్ద సినిమాలైన ఆర్ఆర్ఆర్, పుష్ప రెండింటినీ ముందుగా విడుదల చేస్తే మూత పడిన థియేటర్స్ కి కొత్తకళ వస్తుందనే ఉద్దేశంతో ఆ సినిమాలకు అడ్డురాలేదు. ఇక చివరికి ఆగష్టు న మా సినిమా కు డేట్స్ దొరికాయి. లైగర్ సినిమాకు తొలి నుండి అడ్డంకులు వస్తూనే ఉన్నా మేము ఎక్కడా ఆగలేదు అంటూ ఛార్మి మీడియాలో మీటింగులో చెప్పింది. ఇక జనాలు థియేటర్ వచ్చి ఒక సినిమా చూడాలంటే అందులో వాళ్ళను ఆశ్చర్య పరిచే ఏదో ఒక విషయం ఉండాలి.

ఓటీటీ వచ్చాక సినిమాలను ఇంటిల్లిపాది కూర్చొని ఇంట్లో చూడటం ఇష్టపడుతున్నారు అలాంటి వాళ్ళను థియేటర్ కి రప్పించాలంటే సినిమాలో కంటెంట్ చాలా అవసరం. సినిమాలను థియేటర్ కి వచ్చి చూసే పరిస్థితి లేదా అంటే బింబిసార, సీతా రామం, కార్తికేయ వంటి సినిమాలు 150 కోట్ల వరకు వసూళ్లను రాబట్టాయి. చిన్న సినిమాలుగా వచ్చి బాలీవుడ్ లోనూ 100 కోట్ల వరకు వసూళ్లను రాబడుతున్నాయి. ఇక సౌత్ లో సినిమా పిచ్చి లేదని అనడం లేదు కానీ ఎలా జనాలు ఆలోచిస్తున్నారో తెలియడం లేదు కానీ సౌత్ లో పరిస్థితి కొంత డిప్రెస్సింగ్ గానే ఉంది అంటూ కార్తికేయ వంటి సినిమాల మీద ఒకింత ఈర్ష్య వ్యక్తం చేసినట్లుగా ఛార్మి మాట్లాడింది.































