Sri Reddy: చిరంజీవి మాజీ అల్లుడు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. శ్రీజ శిరీష్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా వీరిద్దరూ 2007వ సంవత్సరంలో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది.

కొన్ని మనస్పర్ధలు కారణంగా శ్రీజ ఒక పాప జన్మించిన తర్వాత 2014వ సంవత్సరంలో తన భర్త శిరీష్ భరద్వాజకు విడాకులు ఇచ్చి తండ్రి వద్దకు వచ్చారు. అనంతరం ఈమె 2016వ సంవత్సరంలో కళ్యాణ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇక శిరీష్ సైతం 2019 లో మరొక వివాహం చేసుకున్నారు.
ఇలా రెండో వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి శిరీష్ ఊపిరితిత్తుల వ్యాధి సమస్యతో బాధపడుతూ గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈయన ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈయన మరణం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సంచలన తారా శ్రీరెడ్డి శిరీష్ మరణం పై స్పందించారు.
అందరూ మోసం చేశారు..
శిరీష్ మరణ వార్త గురించి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. శిరీష్ భరద్వాజ్ (చిరంజీవి మాజీ అల్లుడు) ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికింది రా అందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన సంచలనంగా మారుతూ ఉంటాయని మనకు తెలిసిందే.



























