Chiranjeevi: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాల గురించి మాత్రమే మాట్లాడేవారు తెలుగు సినిమాలకు గతంలో ఏ విధమైనటువంటి ఆదరణ గౌరవ మర్యాదలు ఇచ్చేవారు కాదు. ఈ క్రమంలోనే 2007వ సంవత్సరంలో జరిగిన వజ్రోత్సవాల్లో భాగంగా తెలుగు సినిమాలకు ఎంతో అవమానం జరిగిందని గతంలో ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది బాలీవుడ్ నటీనటుల ఫోటోలు ప్రదర్శించబడినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణమైనటువంటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వారి విగ్రహాలు లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని తెలుగు చిత్ర పరిశ్రమకు సరైన గౌరవం లభించలేదంటూ గతంలో చిరంజీవి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా ఎక్కడైతే తెలుగు చిత్ర పరిశ్రమకు అవమానం జరిగిందో ఇప్పుడు అదే వేదికపై తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గౌరవ మర్యాదలు లభించడం విశేషం.గోవాలో జరగబోతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా ఎన్నో తెలుగు సినిమాలను ప్రదర్శించడం విశేషం. ఒకప్పుడు ఏ వేదికపై అయితే మనకు గౌరవం లభించలేదో ఇప్పుడు అదే వేదికపై తెలుగు సినిమాలను ప్రదర్శించబడటంతో తెలుగు సినిమా ఖ్యాతి ఎలాంటి శిఖరాలను చేరుకుందో అర్థమవుతుంది.

ఇండియన్ పనోరమా విభాగంలో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సినిమాలు…
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ విధమైనటువంటి గుర్తింపు రావడానికి గల కారణం ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పాలి. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఆనాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి గుర్తింపు లేదని మెగాస్టార్ బాధపడ్డారు ఇప్పుడు అదే వేదికపై తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు రావడంతో గత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
































