Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో అంచలంచెలుగా ఎదుగుతూ హీరోగా అగ్ర శిఖరానికి చేరుకున్న చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దగా నిలబడ్డారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తన వంతు సహాయం చేస్తూ అందరిని ఆదుకుంటున్నాడు.

ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమంది ఆర్టిస్టులను ఆదరించి వారికి సహాయ సహకారాలు అందించాడు. అంతేకాకుండా తాజాగా బలగం సినిమా ద్వారా గుర్తింపు పొందిన సింగర్ కి కూడా ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా ఆయన ఆరోగ్యానికి కావాల్సిన చికిత్స కూడా ఉచితంగా చేయిస్తానని మాట ఇచ్చాడు. అయితే చిరంజీవి ఎంతమందికి సహాయం చేసినా కూడా తాను సహాయం చేసిన విషయాన్ని నలుగురిలో బయటపెట్టకుండా చాలా గుట్టుగా ఉంచుతాడు.
అందువల్ల ఆయన సినిమాలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా రియల్ హీరో అని అభిమానులు పొగుడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవి చేసిన మరొక మంచి పని గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తాము చదివిన కళాశాల బాగు కోసం అంతో ఇంతో సహాయం చేయాలనుకుంటారు. అలాగే చిరంజీవి కూడా తాను చదివిన కాలేజీ కోసం పెద్ద మొత్తంలో సహాయం చేసినట్లు ఆ కాలేజీ యాజమాన్యం వెల్లడించింది.

Chiranjeevi: లక్షల్లో సహాయం…
చిరంజీవి తాను చదివిన వై ఎన్ కాలేజీ అభివృద్ధి కోసం తాను ఎంపీగా ఉన్న సమయంలో 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని, అంతేకాకుండా తాను సొంతంగా కూడా కాలేజీ అభివృద్ధి కోసం కొంత మొత్తం సహాయం చేసినట్లు కాలేజీకి రెస్పాండెంట్ సత్యనారాయణ వెల్లడించాడు. ఈ విషయం తెలియడంతో చిరంజీవి మీద అభిమానులు ప్రశంసలకు కురిపిస్తున్నారు.
































