Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన క్రమశిక్షణకు మారుపేరు అని అందరికీ తెలిసిన విషయమే. మోహన్ బాబు గారు సెట్ లోకి వస్తున్నారంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో అలర్ట్ అయ్యవారు. అయితే మోహన్ బాబు గురించి ఇండస్ట్రీలో ఓ వార్త వినిపించేది. ఆయనకు నచ్చని పని చేస్తే చేయి చేసుకోవడానికి కూడా వెనకాడరు అంటూ చాలా మంది చెబుతుంటారు.

ఈ క్రమంలోనే మోహన్ బాబు గారితో ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఎం.వి.రఘు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన్ బాబు గారితో సుమారు ఆరు సినిమాల వరకు చేశానని మా ఇద్దరి కాంబినేషన్ లో మొట్టమొదటి చిత్రం డిటెక్టివ్ నారద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచిందని ఆయన తెలిపారు.

అలాగే మా ఇద్దరి కాంబినేషన్లో కలెక్టర్ గారు, రాయుడు, చిట్టెమ్మ మొగుడు, సోగ్గాడి పెళ్ళాం, ఖైదీ గారి వంటి చిత్రాలకు తానే సినిమాటోగ్రాఫర్ గా పని చేశానని తెలిపారు. ఇలా మోహన్ బాబు గారితో ఎంతో చనువు ఉన్న ఎం.వి.రఘు అతని సినిమాలు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని కూడా ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
ఎం.వి.రఘు సినిమాలో వీరిద్దరి మధ్య క్లాష్ ఏర్పడిందనే వార్త వినబడుతుంది.
ఇలా మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన అయితే ఈ విషయంపై స్పందించిన ఎం.వి.రఘు మా ఇద్దరి మధ్య ఎలాంటి క్లాష్ లేదని అది కేవలం పుకారు మాత్రమేనని తెలిపారు. మోహన్ బాబు గారు ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. ఆయన సెట్ లోకి వస్తున్నారు అంటే నేను తినడం కూడా మానేసి వెళ్లేవాడిని, సెట్ లో ఎవరు తప్పు చేసినా ఆ ప్రభావం తనపై ఉండేదని ఈ విధంగా ఆయన వస్తున్నారంటే భయంతో వణికిపోతూ ఎక్కువ టెన్షన్ పడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని తెలిపారు.ఇలా ఆరోగ్యం పాడవుతున్న నేపథ్యంలో ఇంట్లో వాళ్ళు కూడా అంత టెన్షన్ పడుతూ సినిమాలు చేయడం దేనికి మానేయొచ్చు కదా అని చెప్పడం వల్లే మోహన్ బాబు గారితో సినిమాలు చేయడం మానేశాను అని అంతకు మించి తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఎం.వి.రఘు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.


































