Featured
CM Revanth Reddy : ముఖ్యమంత్రులే మారారు.. మిగతాదంతా సేమ్ టు సేమ్..!
Published
2 months agoon
అనుభవమైతే కానీ తత్వం బోధపడదని అంటారు పెద్దలు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇప్పుడు టీడీపీ, జనసేనల అవసరం ఉంది కాబట్టి ఏపీకి వరాల జల్లును ప్రధాని మోదీ కురిపించారు కానీ పదేళ్ల పాటు అసలు తెలుగు రాష్ట్రాల వైపే చూడలేదు. ఆ మాట కొస్తే తెలంగాణ సహా తనకు అవసరం లేని ఏ రాష్ట్రాల వైపు మోదీ చూడరు అనేది జగమెరిగిన సత్యం. గులాబీ బాస్ కేసీఆర్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. ఆ పదేళ్లూ మోదీయే ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారం మారింది కానీ కేంద్రంలో మారలేదు. తెలంగాణ ఎప్పుడు సామంత రాజుల మాదిరిగా కేంద్రానికి పన్నుల రూపంలో కప్పం కట్టుడే కానీ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. జీఎస్టీ పేరిట రాష్ట్రాలకు రావల్సిన పన్నులను సైతం కేంద్రమే ఎగరేసుకుపోతోంది. దీంతో రాష్ట్రాలు వాటి బాధ అవి పడుతున్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం కూడా కేంద్రంతో పలుమార్లు భేటీ అయినా కూడా ఒరిగిందేమీ లేదు.
తెలంగాణ వైపు కూడా చూడలే..
ఇక తెలంగాణలో మోదీకి అవసరం లేదు కాబట్టి ఆయన పొరపాటున కూడా ఏమీ విదల్చరని గ్రహించిన కేసీఆర్ కేంద్రంలో మోదీని గద్దె దింపాలనుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ను స్థాపించి మొత్తానికే ఇబ్బందుల్లో పడ్డారు. అప్పట్లోనూ ఈ నీతి ఆయోగ్ వంటి సమావేశాలు జరిగాయి. కానీ కేసీఆర్ మాత్రం వెళ్లేవారు కాదు.. దీనిని రేవంత్ సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. అక్కడికి వెళ్లినా ఒరిగేదేమీ ఉండదని కేసీఆర్ చెప్పేవారు. ఇన్నాళ్లకు ఈ విషయం రేవంత్కు కూడా బోధ పడింది. తొలినాళ్లలో అయితే రేవంత్ ప్రధాని వస్తున్నారంటే నానా హంగామా చేసేవారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం వంటివి చేసేవారు. పైగా పెద్దన్న, బడేమియా అంటూ ఆకాశానికి ఎత్తేసేవారు. అయినా ప్రయోజనం శూన్యం. కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణ వైపు కూడా మోదీ చూడలేదు. దీంతో రేవంత్కు మోదీ ఏంటనేది బాగా తెలుసొచ్చిందట. ఇక మీదట మోదీ రాష్ట్రానికి వచ్చినా దేఖను కూడా దేఖరేమో.. ఢిల్లీకి వెళ్లి మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ అయినా కూడా పట్టించుకోలేదు. దీంతో ఇక మీదట మోదీని కూడా మనం పట్టించుకోకూడదని రేవంత్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
మరో కేసీఆర్లా రేవంత్..
ఇప్పుడు కేసీఆర్ బాటలోనే రేవంత్ కూడా నడవనున్నారు. ఇవాళ జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ చెప్పిన ఆన్సరే. వెళితే వాళ్లు పెట్టే పల్లీ బఠాని తిని రావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. వాళ్లు చెప్పేది వినాలే తప్ప. మనం చెబితే వినే నాథుడే ఉండరక్కడ అని కేసీఆర్ అనేవారు. కానీ అప్పట్లో రేవంత్ మాత్రం ఎందుకు వెళ్లరు? రాష్ట్ర సమస్యలను చర్చించాలి కదా అంటూ ధూం ధాం చేసేవారు. ఇప్పుడు తత్వం బోధ పడింది. రేవంత్ కూడా బడేమియాను దూరం పెట్టేశారు. ఈ క్రమంలోనే బడ్జెట్లో మొండి చేయి చూపించడంపై తెలంగాణ అసెంబ్లీలో ఓ తీర్మానం కూడా చేశారు. మొత్తానికి రేవంత్ మరో కేసీఆర్లా మారుతున్నారు. అయితే రేవంత్కు ఒక ప్లస్ ఏంటంటే.. ఇండియా కూటమిలోని కీలక పార్టీలో ఉన్నారు. కేసీఆర్ ఒంటరి వారు అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక మనం మొన్నటి వరకూ మోదీ వర్సెస్ కేసీఆర్ చూశాం.. ఇక ఇప్పటి నుంచి రేవంత్ వర్సెస్ మోదీ వార్ ఎలా ఉండబోతోందో చూడాలి.
You may like
Harish Rao : ఆయకట్టుకు నీళ్లు అందించండి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీష్ రావు!
KTR : స్కెచ్ గీసిన కేటీఆర్.. ఏంటిది వేళ కాని వేళలోనా?
Chiranjeevi: మెగా విందుకు హాజరైన రేవంత్ రెడ్డి.. చిరంజీవికి ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం?
Dil Raju: ఎన్నికలవేళ కెసిఆర్ ని కలిసిన దిల్ రాజు.. రాజకీయంగా మొదలైన చర్చలు?
Karate Kalyani: సీఎం రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టిన కరాటే కళ్యాణి.. ఏం జరిగిందంటే?
Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆదేశాలతో తీరిన కుమారి ఆంటీ కష్టాలు.. మరింత పాపులర్ అయిన కుమారి ఆంటీ?
Featured
Vishnu Priya: హౌస్ లో విష్ణుప్రియ బట్టలు మార్చుకోవడం చూసింది అతనేనా.. ఎవరంటే?
Published
28 mins agoon
13 September 2024By
lakshanaVishnu Priya: బిగ్ బాస్ హౌస్ అంటేనే పెద్ద ఎత్తున గొడవలు వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ల మధ్య ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్న విష్ణు ప్రియ సోనియా మధ్య భారీ స్థాయిలో వివాదం జరుగుతుంది. సోనియా విష్ణు ప్రియ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.
నీకు ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ ఉంది నీలాగా బట్టలు వేసుకుని తిరగలేను అంటూ ఇస్టానుసారంగా మాట్లాడటంతో సోనియా బాగా నెగిటివ్ అవుతుంది. నిజానికి విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బిగ్ బాస్ హౌస్లో చేయలేదు. అంతేకాకుండా సోనియా ఫేమస్ అవడం కోసం విష్ణు ప్రియను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
ఇక విష్ణు ప్రియ గురించి నిఖిల్, అభయ్ దగ్గర మాట్లాడుతూ.. విష్ణుప్రియ రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉంటే ఆదిత్య ఆ రూంలోకి వెళ్లారు. అయన వణుకుతూ బయటకు వచ్చారు.. ఆమె జస్ట్ బ్లౌజ్ లో ఉంది మళ్లీ వచ్చి ఆదిత్య గారు ఆన్ కంఫర్ట్బుల్ గా ఫీల్ చేశాను సారీ సారీ అని చెప్తుంది.
ఆదిత్య ఓం..
నిజానికి ఆదిత్య ఓం అంత అన్ కంఫర్ట్బుల్ ఫీల్ అయ్యారని అతనికి కూడా తెలియకపోవడం గమనించాల్సిన విషయం. సోనియా హౌస్ లో ఫేమస్ అవడం కోసం కేవలం విష్ణు ప్రియ ను టార్గెట్ చేస్తూ రావడంతో ఈమె పట్ల అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు తనని హౌస్ నుంచి బయటకు పంపించేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై ఈ వారం నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.
Featured
Janhvi Kapoor: దేవర ప్రమోషన్స్ కోసం జాన్వీ కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?
Published
29 mins agoon
13 September 2024By
lakshanaJanhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ముంబైలో ఎంతో ఘనంగా లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో నటించారు.
ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా జాన్వీ కపూర్ గులాబీ రంగు చీర కట్టుకొని సందడి చేశారు. అయితే ఈమె చీర అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈమె కట్టిన ఈ చీర ఖరీదు ఎంత ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ వేడుకలో జాన్వీ కపూర్ నచికేత్ బ్రావే డిజైన్ చీరను కట్టారు.
దేవర…
ఈ చీర ఖరీదు అక్షరాల రూ. 1,24,850. అలాగే పింక్ శారీకి పెయిర్ అప్ గా చెవులకు జాన్వీ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ధర రూ. 13 లక్షలని తెలిసిన అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇలా సెలబ్రిటీలు బ్రాండెడ్ దుస్తులను ధరించడం సర్వసాధారణం. ఇక దేవర సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Featured
Star Anchor: నాట్యం చేస్తున్న ఈ నాట్య మయూరిని గుర్తుపట్టారా… ఇప్పుడు టాప్ యాంకర్?
Published
31 mins agoon
13 September 2024By
lakshanaStar Anchor: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు ఆ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా ఒక యాంకరమ్మ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
నాట్యం మయూరిలా ఎంతో చక్కగా నాట్యం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె అభిమానులు ఈ ఫోటోను మరింత వైరల్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలో ఉన్న ఈమె ఎవరో తెలుసా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్. ఎస్ మీరు గెస్ చేసినది కరెక్టే ఇక్కడ ఉన్నది యాంకర్ సుమ.
సుమా కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తన తల్లి తండ్రుల ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు. ఇక హైదరాబాదులో ఉంటూనే ఈమె ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. మొదట దేవదాస్ కనకాల దర్శకత్వంలో వచ్చిన మేఘమాల సీరియల్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయము కాస్త ప్రేమగా మారడం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.
యాంకర్ సుమ..
ఇలా పెళ్లి తర్వాత కూడా సుమ ఇండస్ట్రీలో పలు సినిమాలు అలాగే సీరియల్స్ లో నటించారు. అనంతరం యాంకర్ గా కూడా మారి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఏదైనా ఒక సినిమా వేడుక జరుగుతుంది అంటే కచ్చితంగా ఆ కార్యక్రమంలో సుమ ఉండాల్సిందే. ఆ సినిమా టీజర్ లాంచ్ నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ వరకు సుమ పాత్ర ఎంతగానో ఉంటుందని చెప్పాలి.
Vishnu Priya: హౌస్ లో విష్ణుప్రియ బట్టలు మార్చుకోవడం చూసింది అతనేనా.. ఎవరంటే?
Janhvi Kapoor: దేవర ప్రమోషన్స్ కోసం జాన్వీ కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?
Star Anchor: నాట్యం చేస్తున్న ఈ నాట్య మయూరిని గుర్తుపట్టారా… ఇప్పుడు టాప్ యాంకర్?
Sonia Akula:వర్మ ఇంటికి రమ్మన్నారు.. ఇంటికి వెళ్తే అలా జరిగింది… షాకింగ్ కామెంట్స్ చేసిన సోనియా?
Bigg Boss 8: రెండో వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆమెనా… అమ్మాయిలే టార్గెటా?
Lakshmipathi : కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు టాలీవుడ్ హీరో అని తెలుసా… ఎవరంటే?
John Abraham : ఒకప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.. కట్ చేస్తే 500 కోట్లకు అధిపతి.. ఈ హీరో గురించి తెలుసా?
Ankitha: ఎన్టీఆర్ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుందో తెలుసా?
Bigg Boss 8: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా నందమూరి హీరో… ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
Trending
- Featured3 weeks ago
Lakshmipathi : కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు టాలీవుడ్ హీరో అని తెలుసా… ఎవరంటే?
- Featured3 weeks ago
John Abraham : ఒకప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.. కట్ చేస్తే 500 కోట్లకు అధిపతి.. ఈ హీరో గురించి తెలుసా?
- Featured4 weeks ago
Ankitha: ఎన్టీఆర్ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుందో తెలుసా?
- Featured4 weeks ago
Bigg Boss 8: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా నందమూరి హీరో… ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
- Featured1 week ago
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
- Featured1 week ago
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Featured2 weeks ago
Sri Devi: 37 ఏళ్ల వయసులో హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ హీరోయిన్.. సక్సెస్ అయ్యేనా?
- Featured4 weeks ago
Imanvi: యూట్యూబర్ గా ఇమాన్వి ఆదాయం 3 లక్షలే.. ప్రభాస్ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?