YS Jagan: ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు కొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైసిపికి అనుకూలంగా వచ్చాయి మరికొన్ని కూటమికి అనుకూలంగా వచ్చాయి.

ఇలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసిన తర్వాత కార్యకర్తలలోనూ నేతలలోనూ పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకే మాట మీదే ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐ ప్యాక్ వారితో మాట్లాడుతూ ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నామని 2019 ఎన్నికల కంటే అత్యధిక సీట్లు రాబోతున్నాయని తెలిపారు.
ఇక ఇటీవల విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై జగన్ పెద్దగా స్పందించలేదు. అలాగే ఏ విధమైనటువంటి కంగారు కూడా వ్యక్తం చేయలేదు. ఇక ఎన్నికల ఫలితాలు వెలబడుతున్న నేపథ్యంలో జగన్ పలువురు కీలక నేతలను తాడేపల్లికి పిలిపించారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని అంశా నిర్దేశాలు కూడా చేశారని తెలుస్తోంది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి గొడవలు అల్లర్లకు తావులేకుండా చూడాలని పిలుపునిచ్చారు.
ఇకపోతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు అందరిని కూడా ఆరో తేదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు రావాలని సూచించారు. కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే కాకుండా గెలిచిన ఎంపీ అభ్యర్థులందరూ కూడా సమావేశం కావాలని జగన్ సూచించారు. ఇక జగన్ తన గెలుపుపై ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జూన్ 9వ తేదీ వైజాగ్ లోనే తన ప్రమాణ స్వీకారం అని కూడా ఈయన వెల్లడించారు. ఇలా ఎంతో ధీమాగా ఉన్నటువంటి జగన్ ఏ స్థాయిలో విజయం సాధిస్తారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.





























