Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ధవళ సత్యం. ఈయన ఎంతో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన కూడా దాసరి శిష్యుడు. ఇలా దాసరి శిష్యుడుగా ఇండస్ట్రీలో కొనసాగిన ధవళ సత్యం దర్శకుడిగా మారిన తరువాత మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవితో జాతర అనే సినిమా తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా తెరకెక్కే సమయంలో అందరూ కొత్తవాళ్ళే. ప్రొడ్యూసర్ నుంచి మొదలుకొని డైరెక్టర్, కెమెరా మెన్స్ అందరూ కూడా కొత్త వాళ్లే. ఇక ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంపిక చేశాను. అయితే గతంలో తన సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా చూపిస్తానని ఆయనకు మాటిచ్చాను. ఈ క్రమంలోనే జాతర సినిమాలో తనను హీరోగా తీసుకున్నానని తెలిపారు.

ఇక ఈ సినిమాలో చిరంజీవిను తీసుకోవడం అందరికీ
ఇష్టమే అయితే దాసరి గారు వచ్చి అందరూ కొత్తవాళ్ళే చిరంజీవి కాకుండా వేరే హీరోను తీసుకోవచ్చు కదా అంటే తనకు సలహా ఇచ్చారు. ఆ సమయంలో నేను మాట్లాడుతూ అతని మొహంలో ఏదో ఫెయిర్ ఉంది. ఈ పాత్రకు కరెక్టుగా సరిపోతాడని నమ్మకం ఉందని చెప్పాను.ఏంట్రా నమ్మకం చిరంజీవిని తీసేసి చంద్రమోహన్ ని పెట్టుకో అంటూ చెప్పారు.
రంగస్థలం సినిమా కూడా అదే…
గురువుగారు అలా చెప్పినప్పటికీ జాతర సినిమాలో చిరంజీవి గారిని హీరోగా తీసుకుని సినిమా చేశామని ఈ సందర్భంగా ధవళ సత్యం జాతర సినిమా గురించి తెలిపారు.ఈ సినిమా రంగస్థలం సినిమా ఒకటే కాన్సెప్ట్ అని ప్రశ్నించగా… నిజం చెప్పాలంటే ఆ రెండు ఒకే కథ అంటూ ధవళ సత్యం ఈ సందర్భంగా తెలిపారు.

































