Sukumar-Pushpa: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే రూ. 100 కోట్లను వసూళ్లను క్రాస్ చేసింది. ప్యాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీ అన్ని భాషల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.

సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. తగ్గేదే లే అన్న రీతిలో వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది. సినిమాకు ముందే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెద్ద హిట్ అయింది. దీంతో పాటు సమంత ఐటెం సాంగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. తాజాగా పుష్ప సినిమా యూనిట్ థాంక్స్ మీట్ లలో పాల్గొంటుంది. తాజా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుకుమార్ ఎమోషనల్ అయ్యారు.

ముందుగా బన్నీ మాట్లాడుతూ.. సుకుమార్ లేకుంటే స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ లేదు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో సుకుమార్ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు. పుష్ప సక్సెస్ లో తన భార్యకు కూడా పరోక్షంగా కారణం అంటూ.. సుకుమార్ తన భార్య గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆ తరువాత.. సినీ గేయరచయిత చంద్రబోస్ కాళ్లను మొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు సుకుమార్.
వాళ్లందరికి ఒక్కో లక్ష రూపాయలు.. ప్రకటించిన సుకుమార్:
ఇదిలా ఉంటే సుకుమార్ తన టీంకు బంఫర్ ఆఫర్ ప్రకటించాడు. తన టీంకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించారు. సుకుమార్ మాట్లాడుతూ.. ప్రొడక్షన్ బాయ్స్, సెట్ బాయ్స్ ఇలా అందరిని కష్టపెట్టానని తెలుసని సుకుమార్ వారి గురించి మాట్లాడారు. ఆర్య దగ్గర నుంచి రంగా బ్యాచ్ అని ఒకటి ఉందని… 24 గంటలు ఆలోచించవచ్చు కానీ.. 24 గంటలు పనిచేస్తూ ఉండగలమా అని ప్రశ్నించారు. ఈ విధంగా బండలెత్తుతూ వారంతా పనిచేశారని తెలిపారు. సెట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ కి, లైట్ మెన్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని సుకుమార్ ప్రకటించారు.






























