Shanmukh-Jaswanth: యూట్యూబర్ గా, వెబ్ సిరీస్ లో నటించి ఎంతో పాపులారిటీ దక్కించుకున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. బిగ్ బాస్ కి వెళ్లక ముందు తన గురించి ఎంతో పాజిటివ్ ఉన్న వారిలో కూడా ఈ కార్యక్రమం ద్వారా నెగిటివిటీ ఏర్పరచుకొని బయటికి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తప్పకుండా బిగ్ బాస్ అందుకుంటారని చాలామంది భావించారు.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులు, అభిమానులు జీర్ణించుకోలేక పోయారు దీంతో పెద్దఎత్తున షణ్ముఖ్ గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో ఆయన బిగ్ బాస్ ట్రోఫీకి కూడా దూరమయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి షాక్ అయినట్లు తెలిపారు. అలాగే బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు.అక్కడ జరిగే 24 గంటలలో కేవలం గంట మాత్రమే టెలికాస్ట్ అవుతుందని ఆ గంట వల్ల వారికి చాలా నెగిటివిటీ వచ్చిందని తెలిపారు.
బిగ్ బాస్ హౌస్ లో మనం చేసిందే కరెక్ట్:
అదేవిధంగా బిగ్ బాస్ కార్యక్రమం నుంచి తాను ఏం నేర్చుకోలేదని కేవలం నెగిటివిటీ ని మాత్రమే మూటకట్టుకుని బయటకు వచ్చానని తెలిపారు. అక్కడ అ మనం ఏది చేస్తే అదే కరెక్టు అనే భావనలో ఉంటాము. ఎవరు ఏం చెప్పినా మనమే కరెక్ట్ అనే భావన ఉండటం వల్ల పరిస్థితి ఇంతవరకు వచ్చిందని, ఇది మంచి ఇది చెడు, బయట ఇలా జరుగుతుందని చెప్పే వాళ్ళు లేరు కనుక అక్కడ మనం ఏం చేస్తే అదే కరెక్ట్ అనిపిస్తుందని ఈ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ వెల్లడించారు.




























