కరోనా ఆయుర్వేదం మందు ఇస్తున్నరంటూ సోషల్ మీడియాలో అనేక వదంతులు వస్తున్నాయి. వీటిపై స్పందించారు నెల్లూరు, కృష్ణపట్నం ఆనందయ్య. సోషల్ మీడియా వస్తున్నా వార్తలు అవాస్తవం. కరోనా ఔషధం కోసం ఎవరూ కృష్ణపట్నం రావొద్దు.

ఔషదం పై ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లభించలేదు. ఆని స్పష్టం చేసారు ఆనందయ్య. మరోవైపు ఈ ఔషద తయారీకి వినియోగించే ఆకులు, దినుసులు మొదలైనవి కూడా సిద్దంగా లేవని ఆనందయ్య తెలిపారు. ఇటువంటి నేపధ్యంలో ప్రజలందరూ ప్రయాణాలు చేస్తూ కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు ఆనందయ్య.































