Health News

ఎండాకాలంలో చల్ల నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

వేసవి కాలం ప్రారంభం అవడంతో మండే ఎండలతోపాటు అనేక సమస్యలను వెంట తీసుకువస్తుంది. ముఖ్యంగా బయటి ప్రదేశాల్లో పనిచేసేవారు చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. వేడి వాతావరణం కారణంగా శరీరంలోని తేమ ఆవిరై డీ-హైడ్రేషన్ కు గురవుతారు. డీహైడ్రేషన్ నుంచి విముక్తి పొందడం కోసం ఎన్నో శీతల పానీయాలను తీసుకుంటారు.వీటిని తీసుకోవడం వల్ల దాహం తీరడం ఏమో కానీ, తర్వాత అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పంచదార, ఉప్పు కలిపిన నీటిని తాగితే వెంటనే ఉపసమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. శరీర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల లేదా అంత కన్నా ఎక్కువ ఉండటాన్ని వడదెబ్బతగలడం అంటారు. దాంతో శరీరం డీ-హైడ్రేషన్ కి గురవుతుంది. ఈ సమయంలో తలనొప్పి, వాంతులు, అలసట, బలహీనంగా అవటం, కండరాల తిమ్మిరులు మరియు కళ్ళు తిరగటం లక్షణాలుగా కనపడతాయి.హార్ట్ స్ట్రోక్ కి కూడా కారణమయ్యే అవకాశం ఉంది.

వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

  • వేసవిలో మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి రెండుసార్లు స్నానం చేయడం మంచిది. మరి చల్లగా ఉన్న నీటిని స్నానానికి వాడితే హఠాత్తుగా శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. కావున స్నానానికి గోరు వెచ్చని నీటి వాడడం మంచిది.
  • వేసవిలో మనం సహజంగా రోజుకు 7-8 లీటర్ల నీళ్లు తాగడం మంచిది అలాగే ప్రకృతి సిద్ధంగా దొరికే తాజా పళ్ళ రసాలను, మజ్జిగ తీసుకోవడం మరీ మంచిది.
  • వేసవిలో ఎక్కువగా సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. కావున సాధ్యమైనంత వరకు ఉదయం పది గంటలలోపు సాయంత్రం ఐదు తర్వాత బయటికి వెళ్లడం మంచిది ఇది.

*వేసవిలో ముఖ్యంగా జంక్ ఫుడ్, ఆల్కహాల్, అధిక మసాలా ఉన్న ఆహారం, కెఫీన్ శరీరంలో వేడికి కారణమవుతాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలి

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago