కరోనా దెబ్బకు భారీ నష్టాల్లో కూరుకు పోతున్నాయి పలు దిగ్గజ సంస్థలు. తాజాగా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కుదేలైంది. గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ. 40 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే గత ముప్పై ఏళ్ళలో ఇదే భారీ నష్టం అని, తమ ఆదాయం 66% తగ్గిందని ఆ సంస్థ తెలిపింది.

ప్రస్తుత కరోనా కాలంలో ఇప్పటి వరకూ 66 లక్షల మంది మాత్రమే తమ విమానాల్లో ప్రయాణించారని, గతంతో పోలిస్తే ఇది 90 శాతం తక్కువ అని వెల్లడించింది ఎమిరేట్స్ సంస్థ. పశ్చిమ ఆసియా లోనే అతి పెద్ద సంస్థ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్.






























