Mudragada: ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈయన పేరు మారుమోగిపోతుంది. కాపు ఉద్యమ నేతగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ముద్రగడ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీకి కాకుండా జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి చేరారు. ఇలా వైసీపీ పార్టీలో చేరినటువంటి ఈయన పవన్ కళ్యాణ్ ఓటమికి కృషి చేశారు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో ఎలాగైనా ఓడిస్తానని శపథం చేశారు.

పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక వస్తాను ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మారుతానని ఈయన సవాల్ విసిరారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఏకంగా 70000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో ఆయన పేరు మార్పుకు కూడా అన్ని సిద్ధం చేసుకున్నట్లు ముద్రగడ వెల్లడించారు. అయితే ఈయన పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానని ప్రకటించడంతో రెడ్డి సంఘాల నుంచి వ్యతిరేకత ఏర్పడింది..
తాజాగా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి ముద్రగడ పైన స్పందిస్తూ ఒక లేఖ రాశారు.. అదేమిటంటే మీరు రెడ్డి కులంలో చేరటానికి మారెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా?.. మా రెడ్డి కులంలో ఎందుకు చేరాలనుకుంటున్నారు.. మా వాళ్ల పరువు తీయడానికి చేయాలనుకుంటున్నారా అంటూ పైర్ అయ్యారు. అలాగే ఆంధ్ర రెడ్డి సంఘం నుంచి ఒక విజ్ఞప్తి చేశారు వెంకటరామిరెడ్డి..
నైతిక విలువలు లేవు..
ఇలా నైతిక విలువలు లేకుండా మాట్లాడేవారు మా కులంలో ఉండటానికి వీలులేదని ఈ విషయంపై ఇప్పటివరకు రెడ్డి సంఘాల నేతలు ఎవరు స్పందించకపోవడానికి కూడా వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఇలా ఈయన అభ్యంతరం తెలియచేసినప్పటికీ ఈయన సవాల్ కి తాను కట్టబడి ఉన్నానని అందుకే ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా తన పేరు మార్చుకుంటున్నాను అని తెలిపారు.





























