Exit Polls: జూన్ నాలుగవ తేదీ ఎన్నికల ఫలితాలు వెలబడనున్న నేపథ్యంలోనే అందరి ఆసక్తి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మే 13వ తేదీ ఈ ఎన్నికలు జరిగాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆధారంగానే అన్ని రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఏపీ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠత భరితంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఫలితాలు శనివారం సాయంత్రం 6 గంటలకు వెలబడుతున్నాయి. ఇక ఎన్నికల విషయానికి వస్తే ఎప్పుడూ లేనివిధంగా ఏపీలో ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. పెరిగిన ఈ పోలింగ్ శాతం తమకు అనుకూలంగా మారుతుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సంక్షేమ పథకాలు తమ ఐదేళ్ల పరిపాలన ప్రజలకు నచ్చే స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారని సంక్షేమ పథకాలే తిరిగి మమ్మల్ని అధికారంలో కూర్చోబెడతాయని వైసిపి నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికివారు తామే అధికారంలోకి రాబోతున్నారని చెబుతున్నారు మరోవైపు ఎన్నికలు కూడా వార్ వన్ సైడ్ అనే లాగా జరగలేదు.
ఎవరిది అధికారం..
ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఎవరికి అనుకూలంగా మారాయి.. ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయాలపై ఎంతో ఆత్రుత నెలకొంది. ఇక ఇప్పటికే ఎన్నో సంస్థలు సర్వేలు చేయగా అన్ని సర్వేలలోనూ వైసీపీకే అధికారం ఉందని చెబుతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనేది ఎదురు చూడాలి.





























