AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీని కూడా అభివృద్ధి పథం వైపు నడిపించేలా అన్ని ఏర్పాట్లను చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాదులో ఎంతో విజయవంతమైన ఇండస్ట్రీని అమరావతికి కూడా తీసుకురావడం కోసం చిత్ర పరిశ్రమతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సన్న హాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కొంతమంది సినీ సెలబ్రిటీలు చిరంజీవితో సంప్రదింపులు చేసిన అనంతరం చిత్రపరిశ్రమ అభివృద్ధి గురించి ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలని సూచించినట్లు తెలుస్తుంది.ఏపీకి సినీ పరిశ్రమకు మధ్య బాండింగ్ ని ఏర్పరిచేలా కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారని అది కూడా చిరంజీవితో చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
దీన్ని బట్టి చూస్తుంటే చిరంజీవి ఏపీ రాజకీయాలలో కూడా భాగం కాబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో కూడా చిరంజీవి హస్తము ఉంటుందని తెలుస్తోంది. రాజధాని అమరావతికి సినీ ఇండస్ట్రీకి తీసుకురావడం పైన ఇప్పటికే చాలామంది నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కలిసినట్లుగా తెలుస్తోంది.
వారధిలా చిరంజీవి..
ఈ క్రమంలోనే కొంతమంది నిర్మాతలు భాగ్యస్వామ్యంతో అమరావతిలో ఒక అద్భుతమైన స్టూడియోని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఏపీలో చిత్ర పరిశ్రమ ఏర్పాటు విషయాలన్నింటినీ కూడా చిరంజీవికే బాధ్యతలు అప్పగించారని తెలుస్తుంది. ఈయన చిత్ర పరిశ్రమకు కూటమి ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండబోతున్నారని తెలుస్తోంది.





























