Getup Seenu : జబర్దస్త్ ద్వారా బుల్లితెర కమల్ హాసన్ అని పేరు తెచ్చుకున్న గేటప్ శీను అటు జబర్దస్త్ తో పాటు సినిమాల్లోను మంచి అవకాశాలతో బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాలో నటించాడు శీను. ఇక ఆ సినిమా ఈవెంట్ వరంగల్ లో చాలా గ్రాండ్ గా చేసారు. ఆ ఈవెంట్లో శీను మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాడు.

మూడు రోజులకు 50 వేలు… వద్దనుకున్నా…
శీను లైగర్ ఈవెంట్లో బాలకృష్ణ పైసా వసూలు సినిమాలోని తేడా సింగ్ డైలాగులను మిమిక్రి చేసి అందరినీ నవ్వించాడు. ఇక అదే బాలయ్యబాబు డైలాగ్ ని విజయ్ దేవరకొండ చెబితే ఎలా ఉంటుందో చేసి చూపించి నవ్వించాడు. ఇక సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ విజయ్ స్నేహితుడిగా నేను లైగర్ సినిమాలో నటించాను. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సింగ్ చేస్తాడు. అందుకోసం బ్యాంకాక్ వెళ్లి శిక్షణ తీసుకున్నాడు.

అందుకే అతని స్నేహితుడు క్యారెక్టర్ చేస్తున్న నేను కొంచమైనా బాక్సింగ్ గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే తైక్వాండో నేర్చుకుందామని ట్రైనర్ ని పిలిపించుకుంటే అతను మూడు రోజులకు యాభై వేలు ఫీజు అడిగాడు. షాక్ అయి నా రేంజ్ అది కాదులే అని వద్దనుకున్నాను అంటూ చెప్పాడు. ఇక లైగర్ సినిమా ఈ నెల 25 న పలు భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక మైక్ టైసన్, రమ్యకృష్ణ, విష్ణు రెడ్డి, మకరంద్ దేశ పాండే, రోనిత్ రాయ్, గేటప్ శీను ముఖ్య పాత్రలలో నటించారు.


































