సంక్రాంతి పండుగ రావడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. పండుగకు ముందు బంగారం ధర భారీగా పతనమైంది. ఏకంగా రికార్డ్ స్థాయిలో బంగారం ధర 2,000 రూపాయలు తగ్గింది. ఎంసీఎక్స్ లో బంగారం ధర ఏకంగా 2,086 రూపాయలు తగ్గి 48,818 రూపాయలకు చేరడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న పరిస్థితుల వల్లే బంగారం ధర క్షీణించినట్లు తెలుస్తోంది. బంగారం కొనుగోలు చేసేవాళ్లకు ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది పెళ్లిళ్లు ప్లాన్ చేసుకున్న వాళ్లు బంగారం ఇప్పుడు కొనుగోలు చేస్తే మంచిది. వేర్వేరు కారణాల వల్ల బంగారం ధర తగ్గుతుండగా భవిష్యత్తులో బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1,833 డాలర్లుగా ఉంది. మన దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 51,800 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 47,500 రూపాయలుగా ఉంది.
ఒకవైపు బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటంతో వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. వెండి ధర ఏకంగా కిలోకు 6,1000 రూపాయల వరకు తగ్గాయి. దీంతో ప్రస్తుతం వెండి ధర 63,650 రూపాయలుగా ఉంది. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరలలో స్వల్పంగా మార్పులు ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన ప్రజలకు అందుబాటులోకి రావడం బంగారం ధరలు తగ్గడానికి కారణమవుతోంది.
ఒకటిమికి మించి కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ డ్రైరన్ జరుగుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుందని కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది.
































