Connect with us

General News

Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్… ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..

Google: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చింది. ఒక్క మొబైల్ చాలు అంతా మన చేతిలోకి వస్తోంది. ఇంతా సెల్ ఫోన్

Published

on

Google: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చింది. ఒక్క మొబైల్ చాలు అంతా మన చేతిలోకి వస్తోంది. ఇంతా సెల్ ఫోన్ వినియోగం పెరిగింది. ఇదిలా ఉంటే సెల్ ఫోన్ల వల్ల వచ్చే సెక్యురిటీ త్రెట్స్ కూడా పెరిగాయి. యూజర్ల ప్రైవసీ విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించినా..మన సున్నిమైన సమాచారం దొంగల చేతికి వెళ్లిపోయే ఆస్కారం ఉంది. 

Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్... ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..
Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్… ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..

ప్రస్తుతం తన వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. యూజర్ల ప్రైవసీ పాలసీ విషయంలో భారీ మార్పులు తీసుకురాబోతోంది. 

Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్... ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..
Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్… ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..

ఆపిల్ తరహా సెక్యురిటీ ఫీచర్లను ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందించనుంది. ఐఓఎస్ తరహా ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఐఫోన్లకు అందించే ఫీచర్లను ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లకు తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2021లో ఎప్రిల్ లో ఐఫోన్ యూజర్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని ఆపిల్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్ ని ట్రాక్ చేయకుండా ఉండేలా కొత్త ఫీచర్ ని ఆపిల్ అందిస్తోంది. 

రెండేళ్లలో కొత్త ప్రైవసీ పాలసీ..


అయితే ఇప్పుడు అదే తరహాలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఇలాంటి ఫీచర్ ను గూగుల్ తీసుకురాబోతున్నట్లు తెలిసిొంది. ప్రైవసీ పాలసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్ ప్రోడక్ట్ మెనేజ్మెొంట్ ఉపాధ్యక్షుడు ఆంథోనీ చవెన్ ఓ బ్లాక్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రైవేటు అడ్వర్టయిజింగ్ సోల్యూషన్లు, కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇక థర్డ్ పార్టీలతో డాటా షేర్ చేయడాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. అయితే ఈ మార్పలు అందుబాటులోకి తీసుకురావాటంలే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని ఆయన అన్నారు. థర్డ్ పార్టీ యూజర్లు షేర్ చేసే అంశంలో గూగుల్ కొత్త ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ను తీసుకురానుంది.

Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!