రేపు అనగా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా విడుదలకాబోతోంది. దాదాపు ఈ సినిమా ఏడు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సబంధించి రివ్యూలు అన్నీ పాజిటివ్ గా వచ్చాయి. ఎంతో మంది అల్లు అర్జున్ అభిమానలు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు కొన్ని గంటల దూరంలోనే ఉంది.

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం. మొదట ఆర్య, ఆర్య2 తర్వాత మళ్లీ పుష్పతో జతకట్టారు. అందుకే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మొదట ఒక్క పార్ట్ గా తీయాలనుకున్నా ఈసినిమా నిడివి అత్యధికంగా ఉండటంతో రెండు పార్ట్ లుగా తీయడానికి సిద్ధం అయ్యారు. అందులో మొదటి పార్ట్ పుష్ప.. ది రైజ్ తో రేపు అభిమానుల ముందుకు వస్తున్నాడు బన్నీ.
ఈ నేపథ్యంలో పుష్ప మూవీ టీంకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సినిమా కోసం 5వ షో ప్రదర్శనకు అనుమతిని ఇచ్చింది. అది కూడా రేపటి నుంచి డిసెంబర్ 30 వ తేదీ వరకు రోజు కు థియేటర్లలో 5 షోలు వేసుకోవచ్చని తెలిపింది. టికెట్ల పెంపుపై కూడా సినిమా వాళ్లకే వదిలేసింది ప్రభుత్వం. దీంతో ఈ మూవీ మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ వసూళ్లు సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.
ఇక ఈ సినిమాలో మంగళం శ్రీనుగా ‘సునీల్’ అదిరిపోయే పర్మామెన్స్ ఇచ్చినట్లు సమాచారం. రష్మికా తనదైన శైలిలో నటించినట్లు టాక్. ఇక మొదటిసారిగా సమంత ఐటెం సాంగ్ లో కనిపించబోతోంది. ఊ అంటావా మామ.. ఊ ఊ అంటావా మామ అంటూ కుర్రకారు గుండెళ్లొ రైళ్లు పరుగెత్తించేందుకు సిద్ధం అయింది. సినిమా మొత్తం ఓ ఎత్తు అయితే.. ఈ సాంగ్ మరో ఎత్తు అని సినీ బృంద సభ్యులు ఎన్నో సార్లు చెప్పారు కూడా.
































