సాధారణంగా మనం మన ఇళ్ళల్లో పెంపుడు కుక్కలని పెంచుకోవడం సహజమే. ఈ క్రమంలో ఎప్పుడు కుక్కలను ఇంటి సభ్యులుగా భావించి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ క్రమంలోనే వాటికి ఏదైనా ప్రమాదం తలెత్తితే ఎంతో విలవిలలాడి పోతారు.ఈ క్రమంలోనే కొన్ని కారణాల చేత ఆ కుక్కలు మరణిస్తే వాటికి అంత్యక్రియలను కూడా జరిపించడం ఇది వరకు చూసి ఉంటాము.కానీ కుక్క చనిపోతే విగ్రహం చేయించి దానికి పిండప్రదానం చేయడం ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సుంకర జ్ఞాన ప్రకాష్ అనే వ్యక్తి ఒక కుక్కని పెంచుకున్నాడు. దానికి శునకరాజు అనే పేరు పెట్టాడు. ప్రకాష్ కు తన కుక్క శునకరాజు అంటే ఎంతో ఇష్టం. అది కూడా ఇతను చెప్పే పనులన్నింటినీ అర్థం చేసుకుని ఎంతో చక్కగా చేసేది.అయితే అనారోగ్యం కారణంగా కుక్క మృతి చెందడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు.
చనిపోయిన తన పెంపుడు కుక్క శునక రాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంతటితో ఆగిపోకుండా తన పెంపుడు కుక్కను మరిచిపోలేక.. జ్ఞాన ప్రకాష్ ఏకంగా కాంస్య కుక్క విగ్రహాన్ని తయారు చేయించి , దానిని ప్రతిష్టించి,పిండ ప్రదానం చేశాడు.
ఊరంతా ఫ్లెక్సీలు వేయించి, పురోహితులను పిలిపించి కుక్కకు పిండ ప్రధానం చేసి అందరికీ భోజనాలు పెట్టించారు. ఈ విధంగా శునకరాజు పై జ్ఞాన ప్రకాష్ కు ఉన్న ప్రేమను చూసి కొందరు ఇదేం విడ్డూరం అంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.



























