వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లో పెద్ద ఎత్తున మామిడి పండ్లు దర్శనమిస్తాయి. మామిడికాయలు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పచ్చి మామిడి పండ్లను వివిధ రకాల ఆహార పదార్థాలను ఉపయోగించి తీసుకుంటారు. అదేవిధంగా మరికొందరు పచ్చిమామిడి ముక్కల పై ఉప్పు కారం చల్లి ఎంతో ఇష్టంగా తింటారు. మామిడిపల్లి పోషకాల రారాజు అని పిలుస్తారు. మామిడి పండ్లు ఎన్నో రకాలు ఉన్నాయి.ఒక్కో రకం మామిడిపండు ఒక్కోరకమైన రుచిని కలిగి ఉంటాయి కనుక పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఎన్నో పోషకాలు కలిగిన మామిడి పండ్లు ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

ఆంధ్రప్రదేశ్ లో మనకు ఎక్కువగా బంగినపల్లి, సువర్ణ రేఖ,నీలం, తోతాపురి వంటి మామిడి పళ్ల రకాలు పండిస్తారు. మన రాష్ట్రంలో పండే బంగినపల్లి మామిడి పళ్ళకి ఉన్న డిమాండ్ మరి ఇతర రకాల పండ్లకు ఉండదని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో పండించే ఈ రకమైన మామిడిపండ్లు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.
చౌసా, దసేహరి, లంగ్రా, అల్పోన్సో, కేసర్, పైరి రకాలు మామిడి పండ్లు ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ లో లభిస్తాయి. గుజరాత్ రాష్ట్రంలో ఏకంగా ఎనిమిది రకాల మామిడి పండ్లను పండిస్తారు. అవి కేసర్, అల్ఫాన్సో, రాజాపురి, జామాదార్, తోతాపురి, నీలమ్, దసేహరి, లంగ్రా వంటి రకాలు గుజరాత్ లో ఎక్కువగా పండిస్తారు.
ఇక బీహార్ రాష్ట్రంలో కిసేన్ బోగ్, హిమ్ సాగర్, జర్దాలు బాంబే గ్రీన్, చౌసా, దసేహరి, ఫాజిలి, గుల్బకాస్,లంగ్రా వంటి రకాలను ఎక్కువగా పండిస్తారు. కర్ణాటకలో కూడాఆల్ఫాన్సో, తోతాపురి, బంగినపల్లి, పైరి, నీలం, ముల్ గోవా వంటి మామిడి పండ్లు రకాలు లభిస్తాయ్. ఈ విధంగా మన దేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తారు.మన దేశంలో పండే మామిడి పండ్లకు ఇతర దేశాలలో ఎంతో గిరాకీ ఉండటం వల్ల ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తారు.































