ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొంత కాలం నుంచి వేణు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమా తర్వాత వేణు ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు. తాజాగా ఫ్యామిలీ హీరో వేణు మాస్ మహారాజా రవితేజ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రవితేజ హీరోగా, శరత్ కుమార్ మండవ దర్శకత్వంలో,
సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీంవర్క్స్ బ్యానర్ ల పై నిర్మిస్తున్న “రామారావు ఆన్ డ్యూటీ” అనే సినిమాలో ఓ కీలక పాత్ర ద్వారా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
శరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే డ్యూటీ లో ఉన్నటువంటి రామారావు కోసం మరొక హీరో డ్యూటీలో చేరుతున్నారు అంటూ చిత్ర బృందం తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది. ఇందులో కథానాయికలుగా మజిలి ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన 68వ సినిమాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్నారు. శరత్ కుమార్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతాన్ని సామ్ సిఎస్ అందిస్తున్నారు.





























