Heroine Amani : ‘జంబలకిడి పంబ’ సినిమతో హీరోయిన్ గా తెలుగులో అడుగుపెట్టిన ఆమని ఆ తరువాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి నటించేందుకు స్కోప్ ఉన్న పాత్రలతో ఒదిగిపోయి నటించిన సగటు తెలుగింటి మహిళగా అందరి మదిలో నిలిచిపోయింది. హీరోయిన్ గా దాదాపు అందరు హీరోలతో నటించిన ఆమని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఆ నలుగురు’ సినిమాలో నటించిన మెప్పించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అలరిస్తున్నారు. తన పాత సినిమా విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

శుభలగ్నం సినిమా సమయంలో బాధపడ్డాను…
శుభలగ్నం సినిమా ఆమని పాత్రకు మంచి పేరు వచ్చింది. సినిమా విజయంలో ఆమెదే కీలక పాత్ర. అలాంటి ఆ పాత్ర చేసే సమయంలో కొంత అయోమయంకి గురైందట ఆమని. సినిమా షూటింగ్ కొంత పూర్తయ్యాక నా పాత్ర పెద్దగా ప్రాముఖ్యత లేదేమో రోజా పాత్ర కు మంచి గుర్తింపు వస్తుందేమో అని భయపడిందట. అందులోనూ విలన్ షేడ్స్ పాత్రలో ఉండటంతో భయపడిందట ప్రేక్షకులు ఆ పాత్రను రిసీవ్ చేసుకుంటారా లేదా అని.

ఇక పాటలు నాలుగు షూట్ అయ్యాక అన్నపూర్ణ స్టూడియోస్ చూడటానికి డైరెక్టర్ గారితో కలిసి వెళ్ళినపుడు కూడా రెండు సాంగ్స్ రోజాతో ఉండటతో నా పాత్ర పెద్దగా లేదు సినిమాలో అనుకుందట. అయితే కృష్ణా రెడ్డి గారు ఆమని ని గమనించి ఎదురింటి మంగళ గౌరీ అంటూ వచ్చే నీ పాటే హిట్ అవుతుంది చూడు అన్నారట అయినా కూడా ఆమని భయం తగ్గలేదట. అయితే సుహాసిని గారితో ఒక సీన్ చేసేటపుడు ఆమె కథంతా విని ఈ అమ్మాయి పాత్ర బాగా హైలైట్ అవుతుంది అని చెప్పిన ఒక్క మాటతో నమ్మకం వచ్చిందట ఆమని గారికి. అలా శుభలగ్నం సినిమా విషయంలో బాధపడ్డారట ఆమని. అయితే సినిమా హిట్ అయ్యాక ఆమని కి ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది.































