భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ బృందం, జూలై 20న బర్మింగ్హామ్లో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్లో పాకిస్థాన్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతున్న విషయం ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తాజా ఉగ్రదాడుల నేపథ్యంలో, పాకిస్థాన్ వంటి దేశంతో మ్యాచ్ ఆడటం సరైందా? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లు విమర్శలపాలవుతున్నారు.
పహల్గామ్ దాడి, పాక్ నేతల విద్వేష వ్యాఖ్యలు
ఈ లెజెండ్స్ టోర్నమెంట్ కొత్తది కాదు, గతంలో ఒక సీజన్ విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం ఇది రెండో సీజన్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయాయి. పహల్గామ్ ఉగ్రదాడి — అమాయక పర్యాటకులపై జరిగిన దారుణం — దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ దాడిలో మహిళలు, చిన్నారులపై జరిగిన దుర్మార్గాలు మరచిపోలేని విషాదంగా మిగిలాయి. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్లతో మ్యాచ్ ఆడటమేంటని చాలామంది భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దాడి తర్వాత పాక్ రాజకీయ నాయకులు, మాజీ క్రికెటర్లు భారత్పై విద్వేష వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా షాహిద్ అఫ్రిది, భారత్ను లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా ఉగ్రవాదాన్ని సమర్థించినట్లుగా వ్యవహరించాడు. అంతేకాదు, విజయోత్సవ ర్యాలీలతో భారత ప్రజల మనోభావాలను గాయపరిచాడు.
Kargil mein bhi haraya tha, already itna gire hue ho aur kitna giroge, bewajah comments pass karne se acha hai apne desh ki taraqqi mai dimag lagao @SAfridiOfficial. Humein hamari Indian Army par bohot garv hai. Bharat Mata Ki Jai! Jai Hind!https://t.co/5PVA34CNSe
— Shikhar Dhawan (@SDhawan25) April 28, 2025
ధావన్ గత స్పందన, ప్రస్తుత విమర్శలు
దీనికి స్పందనగా శిఖర్ ధావన్ ఎక్స్ (Twitter) వేదికగా ఘాటుగా స్పందించాడు: “కార్గిల్లో ఓడిపోయారు. ఇప్పటికే దిగజారిపోయారు. ఇంకా ఎంత దిగజారుతారు? దేశం ఎలా మార్చాలో ఆలోచించండి.” అంటూ అఫ్రిదిని కలువకలుపుగా హెచ్చరించాడు.
కానీ ఇప్పుడు అదే అఫ్రిదితో కలిసి మ్యాచ్ ఆడుతున్న శిఖర్ ధావన్పై నెటిజన్ల దృష్టి తిరిగింది. రెండు నెలల క్రితమే “పాక్పై నిరసన” తెలిపిన ధావన్, ఇప్పుడు క్రికెట్ మైదానంలో అఫ్రిదితో కలిసి నిలబడటం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో “ఇదేనా దేశభక్తి?”, “ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఆటలేంటి?”, “దేశం కోసం పోరాడుతున్నామా లేక గ్లామర్ కోసం?” అనే వ్యాఖ్యలతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Indian ex cricketers like Harbhajan, Yuvraj & Dhawan are happily playing WCL matches vs Pakistan in a private league! But when it’s public, they scream nationalism. Why does the Govt stay silent? Is deshbhakti only for common people, not celebs? Hypocrisy much? https://t.co/aelQzXKJNC
— Cricket for her (@coverdrivetoher) July 18, 2025
భవిష్యత్తుపై చర్చ, డిమాండ్లు
ప్రస్తుతం ఈ వివాదంపై శిఖర్ ధావన్ ఇంకా స్పందించలేదు. అయితే ఈ అంశం వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్కి సంబంధించి మరో కోణాన్ని తెరిచింది. దేశ భద్రత, మానవతా విలువల కంటే ఆటగాళ్ల కెరీర్ ప్రాధాన్యతకు తీసుకెళ్లాలా? అనే చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు (BCCI) లేదా సంబంధిత నిర్వాహకులు ఏదైనా స్పష్టత ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Shikhar Dhawan and Afridi did all that fake acting of patriotism in war just to play against each other again on Sunday. I am saying that again patriotism is only for normal public . India will also play with Pakistan in Asia cup too . #INDvPAK pic.twitter.com/ZycCbezndG
— kirat.13_ (@kirat8513) July 18, 2025































