Telangana News: ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నసమయంలో దాదాపు వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు. లేదంటే.. బ్యాంక్ లో పర్సనల్ లోన్ తీసుకుంటారు. అవి రెండు కూడా సాధ్యం కాకపోతే వాళ్ల దగ్గర ఉన్న వస్తువులు అంటే.. బంగారం, వాహనాలను తనఖా పెట్టేసి అవసరానికి డబ్బులను తెచ్చుకుంటారు.

అయితే ఆ డబ్బులను తీర్చలేని క్రమంలో రెండు మూడు సార్లు నోటీసులు పంపించి.. తర్వాత న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చి వేలం వేస్తుంటారు. అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇలాంటి వేలం పాటలను నిర్వహిస్తుంటారు.

కానీ అవి తనఖా పెట్టి డబ్బులు తీసుకెళ్లిన బాపతి కాదు.. వాటిని నిబంధనలు ఉల్లంఘించిన వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు. ఆ వాహనాలకు పలు కేసుల్లో పోలీసులు సీజ్ చేస్తుంటారు. అయితే తాజాగా గోషామహల్ స్టేడియంలో పేరుకుపోయిన 600 వాహనాలకు హైదరాబాద్ సిటీ పోలీసులు మంగళవారం వేలం నిర్వహించారు.
సర్కాస్ కు మాత్రమే ఉపయోగపడే..
నిబంధనలను అనుసరించి తిరిగి తీసుకోవాలని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించినా యజమానులు ముందుకు రాలేదు. అయితే వాటిని ఆ పోలీసులు వేలం నిర్వహించారు. రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 550 మంది బిడ్డర్లు పాల్గొనగా. వాటిలో.. 567 వాహనాలు వేలం నిర్వహించారు. వాటిలో 544 ద్విచక్రవాహనాలు ఉండగా.. 21 త్రిచక్రవాహనాలు.. 2 కార్లు ఉన్నాయి. వీటి ద్వారా రూ. 44.28 లక్షలు సమకూరినట్లు పేర్కొన్నారు. ఇవి కేవలం సర్కాస్ కు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. వినియోగించేందుకు అనుకూలంగా ఉన్న 33 వాహనాలలో 32 ద్విచక్రవాహనాలు ఉండగా .. ఓ కారు ఉందన్నారు. వీటి ద్వారా రూ. 7.46లక్షలు వచ్చాయని పేర్కొన్నారు. మొత్తం వేలం ద్వారా రూ. 51.74 లక్షలను ఖజానాలో జమ చేయనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ వేలం నిష్పక్షపాతంగా జరిగేలా సీపీ పర్యవేక్షించారు.


























