కొన్ని ఘటనలు కొంతమంది జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. అలాంటిదే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఎదురైంది. పెద్ద కుర్మపల్లికి చెందిన మల్లికార్జున్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. తన స్నేహితుడు కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ తో చనిపోయాడు. దీంతో అతడు చాలా బాధపడ్డాడు. ఎందుకు ఇలా జరిగింది.. వాళ్ల రిలేటివ్స్ కు సంబంధించి ఎవరికైనా ఇలాంటి ఉన్నాయా అనేది ఆరా తీశాడు.. కానీ ఎవరకీ అలాంటి వ్యాధులు లేవని తెలుసుకున్నాడు.

చివరకు అతడు క్యాన్సర్ తో చనిపోవడానికి కారణంగా కెమికల్స్ తో కూడిన కూరగాయాలు, ఆకుకూరల పదర్ధాలు తినడమే కారణమని తెలుసుకున్నాడు. దీంతో ఆలోచనలో పడ్డాడు. చివరకు తన సాఫ్ట్ వేర్ జాబ్ వదిలిపెట్టి ఎలాంటి హానికరమైన కెమికల్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇందుకు తన భార్య కూడా సహాయం అందించడంతో దాదాపు 13 ఎకరాల్లో.. 26 రకాల , కూరగాయలు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. మల్లికార్జున్ ప్రయత్నానికి ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ అవార్డును గెలుచుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి రైతుగా మల్లికార్జున్ నిలిచారు. అంతేకాకుండా సేంద్రియ పద్ధతుల్లో కొత్త పద్ధతులను కూడా ప్రేవశపెట్టాడు.
ఇలా దాదాపు అతడు సంవత్సరానికి రూ.16 లక్షల వరకు ఆదాయాన్ని చూపిస్తున్నాడు. దీనిపై అతడు స్పందిస్తూ.. తాము భవిష్యత్ తరాల వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అదించాలని అనుకున్నాను.. ఆ దిశగానే అడుగులు వేశాను అంటూ చెప్పాడు. ఇలా ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతుల ద్వారా నూతన ఒరవడిని స్పష్టించి.. మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచాడు.

































