Hyper Aadi: హైపర్ ఆది ప్రస్తుతం జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. హైపర్ ఆది జనసేన ప్రచార కార్యక్రమాలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నియోజకవర్గంలో పర్యటించినటువంటి ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

జనసేన కార్యకర్తలకు పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను పిఠాపురంలో నిర్వహించామని ఇక్కడ మాత్రమే కాకుండా జనసేన పోటీ చేసే 21 స్థానాలలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించి జనసేన పార్టీ గెలుపుకు దోహదం చేస్తామని తెలిపారు. ఇక పిఠాపురంలో ఎవరి వద్దకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ కి మా ఓటు అని చెబుతున్నారు ఎన్నికలు జరగకుండానే పవన్ విజయం ఖాయమైందని ఆది తెలిపారు.
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్ష మెజారిటీతో గెలుస్తారని తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పిఠాపురంలో అభివృద్ధి పనులు కూడా చాలా వేగంగా జరుగుతాయని ఇప్పుడు మనం హైదరాబాద్ చూడటం కోసం ఎలా వెళ్తున్నామో పిఠాపురం చూడటానికి కూడా అలాగే వస్తారని అంతలా పవన్ అభివృద్ధి చేస్తారని తెలిపారు.
పవన్ విజయం ఖాయం…
అధికార పార్టీ ఎంత మంది నాయకులను రంగంలోకి దింపిన గెలిచేది మాత్రం పవన్ కళ్యాణ్. వార్ వన్ సైడ్ అయిందని హైపర్ ఆది తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు నిధుల కోసం ఎదురు చూస్తూ ఉండకుండా తన సొంత డబ్బుతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఆది తెలిపారు. ఇక ఎన్నికలు పూర్తి అయ్యేవరకు తాము షూటింగ్స్ బంద్ చేశామని ఎన్నికల తర్వాతనే షూటింగులలో పాల్గొంటామంటూ అది తెలిపారు.



























