Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరొక ఏడు రోజుల మాత్రమే సమయం ఉంది. ఇలా సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున రాజకీయ వేడి రాజుకుంది. ప్రచార కార్యక్రమాలకు కూడా కేవలం నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే సినీ నటుడు పోసాని కృష్ణమురళి వైయస్సార్సీపి పార్టీ నాయకుడిగా పని చేస్తూ పార్టీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటమే కాకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలు అందరూ కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేసే సమర్థుడని తెలిపారు అలాగే సంపద సృష్టించగలరని తెలిపారు..
ఇలా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించగలిగే సత్తా తనకు ఉందంటూ టిడిపి నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై పోసాని స్పందించారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్క రూపాయి అయినా సంపద సృష్టించారని కనుక నిరూపిస్తే ఇప్పుడే నేను చంద్రబాబు నాయుడుకి కాళ్లు కడిగి తన పార్టీలో చేరిపోతాను అంటూ సవాల్ విసిరారు.
150 అడుగుల విగ్రహం పెడతా..
అంబేద్కర్ విగ్రహం కన్నా పెద్దది 150 అడుగుల చంద్రబాబు విగ్రహం పెట్టిస్తా. ఒక్క రూపాయి సంపద సృష్టించినట్లు నోటితో చెప్పినా చాలు. ప్రతీ బడ్జెట్ లోటులో ఉందన్న విషయం అందరికీ తెలుసు. మరి సంపద ఎక్కడి నుంచి సృష్టించారు? కనీసం వంకాయ చెట్టు, బీరకాయ చెట్టు అన్నా సృష్టించావా బాబూ? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ అంటూ బాబు పై విమర్శలు చేస్తూ పోసాని చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.





























