Mahasena Rajesh: మహాసేన రాజేష్ తాజాగా కూటమికి పెద్ద షాక్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది తాము జనసేన కార్యకర్తలకు అభ్యర్థులకు మద్దతు తెలియజేయమని ఈయన ప్రకటించారు. మా వర్గానికి పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే జగన్ గారే చాలా మంచి చేశారని మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కులం మతం పేరుతో అన్యాయంగా ఎవరైనా దాడి చేస్తే వారిపై ఎదురు తిరగమని అంబేద్కర్ చెప్పారు. మేము రాజ్యాంగ బద్ధంగానే మాపై దాడి చేసిన వారికి ఎదురు తిరుగుతామని ఈయన తెలిపారు. ఇకపోతే తాను జనసేన పార్టీకి మద్దతు తెలియ చేయలేదని తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వారందరి ఓటమికి కృషి చేస్తానని తెలిపారు.
మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు… ఎక్కడైతే ప్రజలు అన్యాయానికి గురవుతున్నారో వారి కోసం పోరాడటమే మాకు ఇష్టం పదవులు రాజకీయాలు కావాలనుకుంటే మేము ఎప్పుడు జగన్ గారితోనే ఉండే వాళ్ళమని తెలిపారు. పైన ఉన్న నాయకులలో నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేము అంటూ మహాసేన రాజేష్ తెలిపారు.
పదవులు ముఖ్యం కాదు..
ఊహించని విధంగా మహాసేన రాజేష్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడటంతో కూటమి పెద్దలకు పెద్ద ఎత్తున తలనొప్పి వచ్చింది ఈయన జనసేనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పగా దాదాపు 21 సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు దీంతో కూటమికి ఈ వ్యాఖ్యలు కాస్త తలనొప్పిగా మారాయి.





























