ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది… ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ మహమ్మారి దాని వ్యాప్తిని రోజు రోజుకు పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే లాక్ డౌన్ మరింతగా పొడిగించే అవకాశం ఉంది.

తాజగా జవహర్ లాల్ నెహ్రు సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్, ఐఐటి బాంబే, బెంగళూరు ఐఐఎస్ సంస్థలు “కోవిడ్ -19 మెడ్ ఇన్వెంటరీ” అనే సైంటిఫిక్ స్తాటిస్టికల్ మోడల్ ను ఉపయోగించి కొన్ని అంచనాలు విడుదల చేశారు. వీటి లెక్కల ప్రకారం ఒకవేళ మే 3 తరువాత లాక్ డౌన్ కొనసాగించకపోతే మే 19 నాటికి దేశంలో సుమారుగా 38,220 కరోనా మరణాలు సంభవిస్తాయని తెలిపారు. అంతేకాదు దాదాపు 5.35 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావొచ్చని నివేదికలో పేర్కొన్నారు.

మే నెల సగం పూర్తయ్యేసరికి దేశంలో సుమారు 76 వేల ఐసీయూ బెడ్లు అవసరమవుతాయని వెల్లడించారు. ఇది న్యూయార్క్, ఇటలీ కు దాదాపు సరిపోయేలా ఉంటుందని తెలిపింది.































