Connect with us

Featured

KGF 3: కేజిఎఫ్ 3 గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఇనాయత్ ఖలీల్… కేజిఎఫ్ 3 ఉన్నట్టా? లేనట్టా?

KGF 3: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్.ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్

Published

on

KGF 3: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్.ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజీఎఫ్ చాప్టర్ 2ఏప్రిల్ 14వ తేదీ విడుదల అయి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను రాబట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడంతో ప్రస్తుతం ప్రశాంత్ నీల్, యశ్,సంజయ్ దత్, రవీనా టాండన్ పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. వీరితో పాటు కేజిఎఫ్ సినిమా లో మరొక కీలకమైన పాత్ర కూడా ఉంది అదే ఇనాయత్ ఖలీల్.

KGF 3: కేజిఎఫ్ 3 గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఇనాయత్ ఖలీల్… కేజిఎఫ్ 3 ఉన్నట్టా? లేనట్టా?
KGF 3: కేజిఎఫ్ 3 గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఇనాయత్ ఖలీల్… కేజిఎఫ్ 3 ఉన్నట్టా? లేనట్టా?

కే జి ఎఫ్ సినిమా కథ మొత్తం కీలక మలుపు తిరిగే పాత్ర అయినటువంటి పాత్రలో నటించింది మన తెలుగు వారే.టాలీవుడ్ కి చెందిన ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ పాత్రల్లో నటించారు. ఈయన మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

KGF 3: కేజిఎఫ్ 3 గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఇనాయత్ ఖలీల్… కేజిఎఫ్ 3 ఉన్నట్టా? లేనట్టా?
KGF 3: కేజిఎఫ్ 3 గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఇనాయత్ ఖలీల్… కేజిఎఫ్ 3 ఉన్నట్టా? లేనట్టా?

కేజిఎఫ్ చాప్టర్ 2 చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చాప్టర్ 3 ఉంటుందనీ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి ఆయనని ప్రశ్నిస్తూ కేజిఎఫ్ చాప్టర్ 2 లో విలన్స్ అందరూ చనిపోయారు ఇక మిగిలింది ఇనాయత్ ఖలీల్ మాత్రమే… సో చాప్టర్ 3 లో మీరే మెయిన్ విలన్ కదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

కాంట్రవర్సీలోకి లాగకండి…

అలాంటివేమీ నాకు తెలియదు దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగకండి చాప్టర్ 2 చివరిలో కేజీఎఫ్ చాప్టర్ 3 అన్నది నాకు సరిగ్గా కనబడలేదు. నిజంగానే నాకు కనిపించలేదా? లేక మీరు ఇమేజిన్ చేసుకున్నారా? అనే సందేహం కలుగుతుంది అంటూ ఈయన సమాధానం చెప్పారు. అయితే కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చారు. మరి కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందా లేదా అనే విషయం గురించి చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!