రెండో టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ను టీం ఇండియా ఓడించింది. లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభణతో ఇంగ్లీష్ జట్టు మట్టికరించింది. ఐదో రోజు సోమవారం 272 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ అరంభించిన ఇంగ్లండ్ను టీం ఇండియా బౌలర్లు 120 పరుగులకే కట్టడిచేశారు. దీంతో భారత్ చిరస్మరణ విజయం అందుకుంది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ విజయంతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను బారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్ మైదానంలో 89 ఏళ్ళలలో టీం ఇండియాకు ఇది మూడో విజయం. ఇప్పటివరకు ఈ మైదానంలో టీం ఇండియా 19 టెస్టులు ఆడింది.



























