Adivi Sesh: అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా ద్వారా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మహేశ్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ విశేషంగా ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అడివి శేష్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఇకపోతే తన తల్లిదండ్రులు అమెరికాలోనే స్థిరపడ్డారని అడవిశేషు వెల్లడించారు.

అమ్మనాన్నలు అమెరికాలో స్థిర పడ్డారు, నువ్వు కూడా ఎంతో అందంగా ఉన్నావు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావ్ మరి అక్కడ సినిమాల్లో ఎందుకు నటించలేదు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అడివి శేష్ సమాధానం చెబుతూ హాలీవుడ్ సినిమాలలో ఇండియన్స్ అని చాలా దారుణంగా చూపిస్తారు. అక్కడి సినిమాలలో ఇండియన్స్ కి టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులలో పని చేసే వ్యక్తుల పాత్రలను ఇస్తారు.
ఇప్పటికీ కమెడియన్స్ పాత్రలే…
ఇప్పటికి హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయిన వారు కూడా అక్కడ హీరో కాలేరు. కేవలం కమెడియన్స్ పాత్రలలో నటిస్తున్నారు. అందుకే తాను హాలీవుడ్ సినిమాలలో కాకుండా తెలుగు సినిమాలు చేస్తున్నానని అడివి శేష్ తెలిపారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా మేజర్ సినిమా గురించి కూడా ఈయన ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
































