టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాజశేఖర్ – జీవిత గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారే. హీరోయిన్స్గా ఎన్నో సినిమాలు చేసి స్టార్స్గా వెలిగిన వారు. రాజశేఖర్ను పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్గా సినిమాలు మానేసిన జీవిత భర్త రాజశేఖర్ సినిమాలకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ ఆయన వెంటనే ఉంటున్నారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థను స్థాపించి జీవిత – రాజశేఖర్ తమ నిర్మాణంలో సినిమాలు నిర్మిస్తున్నారు.
ఇక జీవిత దర్శకురాలిగానూ సినిమాలు చేశారు. శేషు సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు. ఇలా సినిమా తప్ప మరో ఆలోచన వీరికి లేదు. వీరే కాదు ఇప్పుడు వీరి కూతుళ్ళు ఇద్దరు హీరోయిన్స్గా ఎంట్రీ ఇచ్చారు. రాజశేఖర్ పిల్లలు హీరోయిన్స్గా వస్తున్నారనగానే పాజిటివ్గా స్పందించినవారున్నారు. అంతకంటే ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ చేసిన వారూ ఉన్నారు. ఇది సహజం..ఒక ఫ్యామిలీ నుంచి వారి పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటే వచ్చే కామెంట్స్ చాలా రకాలుగా ఉంటాయి.
అలాంటి కామెంట్స్ పట్టించుకుంటే ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం. అదే జీవిత – రాజశేఖర్ ఫ్యామిలీ కూడా చేసింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా పిల్లలిద్దరికీ ఉన్న అభిరుచిని అర్థం చేసుకొని హీరోయిన్గా నటిస్తామంటే ఎంకరేజ్ చేశారు. శివాత్మిక డెబ్యూ సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ డెబ్యూ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమానే దొరసాని. ఈ సినిమాతో శివాత్మిక ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాదు అందరి నుంచి మంచి ప్రశంసలను దక్కించుకుంది.
ఈ సినిమా ఏకంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం లాంటి అగ్ర నటీ నటులు నటిస్తున్న సినిమా రంగ మార్తాండ. ఈ సినిమాలో శివాత్మిక ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే శివాత్మిక ఇక సెటిల్ అయినట్టే. ఇక ఈ క్రమంలోనే శివాని కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె నటించిన అద్భుతం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాతో శివాని టాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇంతక ముందు మూడు నాలుగు ప్రాజెక్ట్స్ మొదలవ్వాల్సి ఉండగా మధ్యలోనే అవి ఆగిపోయాయి. దాంతో శివాని ఒక దశలో డిప్రషన్లోకి వెళ్ళింది. ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు అద్భుతం సినిమాతో హిట్ అందుకుంది. చాలామంది శివాని – శివాత్మిక పర్ఫార్మెన్స్ను మెచ్చుకుంటున్నారు. నిజంగా వీరికి అవకాశాలు వస్తే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్స్ అవుతారని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరు టాలీవుడ్లో ఏ మేరకు సక్సెస్ అవుతారో.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.