ఒక సినిమాలో పంచ్ డైలాగులు చాలా కాలం వినిపిస్తుంటాయి. ఒక సినిమాలో సీన్ గురించి చాలా కాలం మాట్లాడుకునే అభిమానులు ప్రేక్షకులు చాలామంది ఉంటారు. అలాగే కొన్ని క్లాసిక్ సినిమాల గురించి, కామెడీ ఎంటర్టైనర్స్ గురించి..సినిమా షూటింగ్స్లో జరిగిన సంఘటనల గురించి ఏళ్ళతరబడి మాట్లాడుకుంటుంటారు. అయితే ఇది సినిమా రిలీజ్ తర్వాత ఎన్నేళ్ళు మాట్లాడుకున్నా అది ఓ జ్ఞాపకంలా మిగులుతుంది.
అదే సినిమా రిలీజ్కు ముందుకు మాట్లాడుకుంటే పబ్లిసిటీ అవుతుంది. అదే పబ్లిసిటీ పుష్ప సినిమాకు ఒకే ఒక్క పదంతో విపరీతంగా వచ్చేస్తోంది. అదే తగ్గేదే లే అనే పదం. పుష్ప సినిమా నుంచి పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం టీజర్ను విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తే ఎవరికైనా గూస్బంస్ వచ్చేయాల్సిందే. స్టైలిష్ స్టార్ను కాస్తా ఐకాన్ స్టార్గా మార్చేశాడు దర్శకుడు సుకుమార్.
అయితే ఐకాన్ స్టార్ అని ఇమేజ్ మార్చినప్పటికీ బన్నీని మాత్రం ఊరమాస్ అంటే ఊరమాస్ అవతారంలో చూపించబోతున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ లుక్ చాలా వైల్డ్గా అనిపిస్తోంది. ఓ లారీ డ్రైవర్ ఎలా ఉంటాడో అలా బన్నీ మేకోవర్ మార్చేసిన సుకుమార్..తన బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చాడు. ఒక కొత్త రకమైన మేనరిజాన్ని పుష్ప సినిమాలో చూపించబోతున్నాడు. ఇప్పటికే అల్లుఅర్జున్ తగ్గేదే లే అంటూ ఇచ్చిన ఓ సిగ్నేచర్ మూవ్మెంట్ ఊహించ విధంగా ట్రెండ్ అయింది.
సూటిగా చూస్తూ గడ్డం కిందనుంచి చేతిని ఒకవైపు తిప్పుతూ తగ్గేదేలే అని చెప్పిన పుష్ప రాజ్ డైలాగ్ ఇప్పుడు ఎక్కడ చూసిన ఓ వైరల్ ఫీవర్లా పట్టుకుంది. ఏ షోలో చూసిన ఇదే డైలాగ్ను వాడేసుకుంటున్నారు. బన్నీ కూడా తగ్గొద్దు అంటూ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. సుకుమార్ రాసిన ఈ ఒక్క డైలాగ్ సినిమా రేంజ్ ఏంతో తెలుపుతోంది. రంగస్థలం తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న పుష్ప మూవీ పాన్ ఇండియన్ రేంజ్లో భారీ మాస్ హిట్ అందుకోబోతోందని ఇప్పటికే అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు ఫిక్సైపోయాయి.
డిసెంబర్ 17న భారీ స్థాయిలో 5 భాషలలో రిలీజ్ కాబోతున్న పుష్ప ది రైజ్ పార్ట్ 1 సుకుమార్కు అల్లు అర్జున్కు బాలీవుడ్లో మంచి క్రేజ్ అండ్ మార్కెట్ను తెచ్చిపెడతాయని చాలా నమ్మకంగా ఉన్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సమంత ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో కనిపించబోతోంది. రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.