ప్రేమ ఖైదీ ఫేమ్ మాలాశ్రీ చెల్లెలు శుభశ్రీ. అందరూ కన్నడ అమ్మాయి అనుకునే శుభ శ్రీ అచ్చమైన తెలుగు అమ్మాయి. వీరి కుటుంబం మద్రాస్ వెళ్లి సెటిల్ కావడం జరిగింది. అక్క మాలాశ్రీ కన్నడంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. 1993 శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ డబ్బింగ్ జెంటిల్మెన్ సినిమాతో శుభశ్రీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
అందం,ఆకర్షణ గల శుభశ్రీ గ్లామర్ పాత్రలతో కుర్రకారు అభిమానాన్ని అనతికాలంలోనే సంపాదించుకోగలిగింది. కానీ ఆమె తెలుగులో నేరుగా వినోద్ కుమార్ సరసన ‘అందరూ అందరే’ చిత్రంలో నటించారు. నేషనల్ ఆర్ట్ మూవీస్, మౌళి దర్శకత్వంలో 1994లో అందరూ అందరే చిత్రం విడుదలయింది. గ్లామర్ తోనే కాకుండా మంచి నటిగా కూడా పేరు తెచ్చుకున్న శుభశ్రీ.. హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రెండు సినిమాలు విజయవంతమయ్యాయి. 1995 లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో పెదరాయుడు చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, భానుప్రియ, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో శుభశ్రీ పెదరాయుడు గ్రామానికి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయురాలి పాత్రలో నటించారు.
ఈ సినిమాలో శుభశ్రీ ధరించిన పాత్ర సినిమాను మలుపు తిప్పుతుంది. అయినప్పటికీ ఆమె తన గ్లామర్ డోస్ తో ప్రేక్షకులను హీటెక్కించింది. పెదరాయుడు చిత్రం శుభశ్రీకి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. 1997, రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్, శరత్ దర్శకత్వంలో పెద్దన్నయ్య చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రోజా, ఇంద్రజ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో శుభశ్రీ, బాలకృష్ణ తమ్ముడి భార్యగా నటించారు.
పై రెండు చిత్రాల్లో హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆమె హీరోయిన్ గా నటించిన తదుపరి తెలుగు చిత్రాలను పరిశీలిస్తే.. తెలుగులో అందరూ అందరే సినిమా అనంతరం పోకిరి రాజా, పుణ్యభూమి నాదేశం, గ్యాంగ్ మాస్టర్, కలియుగంలో గందరగోళం అల్లరిపెళ్ళికొడుకు, ఊహ, అక్క బాగున్నావా, హలో నీకు నాకు పెళ్ళంట, అత్త నీ కొడుకు జాగ్రత్త, కుర్రాళ్ళరాజ్యం లాంటి చిత్రాల్లో నటించింది.
విక్రమ్, అలీ, ఉదయ్ బాబు లాంటి చిన్న హీరోలతో శుభ శ్రీ హీరోయిన్ గా నటించారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కావడం చిన్న హీరోలతో నటించడం లాంటి కారణాలతో ఆమె స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయారు. నటించిన ఆ కొద్ది సినిమాలు కూడా బాక్స్ ఆఫీసు వద్ద తీవ్ర పరాజయాన్ని మూట కట్టుకున్నాయి. 2000 సంవత్సరం తర్వాత ఆమె తెలుగు సినిమాలలో పూర్తిగా కనుమరుగయ్యారు. అక్క మాలశ్రీకి వచ్చినటువంటి పేరు కూడా శుభశ్రీకి రాకపోవడం గమనార్హం.
Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయనకు ఓటు మాత్రం మంగళగిరిలో ఉండడంతో మంగళగిరికి వెళ్లి గాజు గ్లాసుకి కాకుండా సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలా మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ కి గురి అవుతున్నాయి. ఓటు వేసిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రింట్ అవుట్ ఇవ్వరా అంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఇలా అడగడంతో అధికారులు ప్రింట్ అవుట్ రాదు అంటూ సమాధానం చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ జరుగుతున్నాయి. కనీసం ఎప్పుడైనా ఓటు వేసిన మొహమా అది అంటూ కొందరు కామెంట్లు చేయగా ప్రింట్ అవుట్ రాదనే విషయం తెలియకుండా ఒక పార్టీకి అధ్యక్షుడు ఎలా అయ్యావు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
ప్యాకేజీ కోసమా.. ఇక ఈ వీడియో పై సజ్జల భార్గవ్ కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ ప్రింట్ అవుట్ అడగడంతో ప్రింట్ అవుట్ చూపించి చంద్రబాబు నాయుడుని మరింత ప్యాకేజీ ఎక్కువగా అడుగుదామనుకుంటున్నారా అంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ భారీ స్థాయిలో ట్రోల్స్ కి గురవుతున్నాయి.
AP politics: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో ముగిసాయి. పలుచోట్ల గొడవలు చోటుచేసుకున్న పెద్దగా ఎక్కడ కూడా రీ పోలింగ్ చేసే పరిస్థితులు ఏర్పడలేదని చెప్పాలి. ఈ విధంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడమే కాకుండా ఊహించని విధంగా 78.5% పోలింగ్ జరగడంతో ఈసారి ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగిందని చెప్పాలి.
ఈ విధంగా ఎన్నికలు ముగిసిన అనంతరం అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందనే విషయాలను కూడా వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఎన్నికలు జరిగిన శైలిని కనుక మనం గమనిస్తే పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు పోలింగ్ బూతుల వద్ద క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈసారి ఎన్నికలు చాలా టఫ్ గా ఉండబోతున్నాయని అందరూ భావించారు. కూటమి అలాగే వైసిపి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుందని కూడా భావించారు కానీ ఎన్నికలు మాత్రం అధికార పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీకి చాలా అనుకూలంగా మారాయని తెలుస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళా సాధికారత కోసం జగన్ కృషి చేశారు అలాగే కులమత బేధాలు లేకుండా సంక్షేమాన్ని అందించారు.
Advertisement
వైసీపీదే అధికారం… ఈ క్రమంలోనే ఈసారి ప్రజలందరికి మద్దతు కూడా అధికార పార్టీకే ఉందని తెలుస్తోంది.గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలను విలేజ్ క్లినిక్లను గ్రౌండ్ లెవెల్ లో అభివృద్ధి చేసినటువంటి జగన్ ఈసారి సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలను విలేజ్ క్లినిక్లను గ్రౌండ్ లెవెల్ లో అభివృద్ధి చేసినటువంటి జగన్ ఈసారి సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి పై కూడా ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తుంది.
Raviteja: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అమర్ ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తనకు రవితేజ అంటే ఎంత ఇష్టం అనే విషయాలను పలు సందర్భాలలో బయటపెట్టారు.
ఇక రవితేజ సినిమా ప్రమోషన్లలో భాగంగా గ్రాండ్ ఫినాలే రోజు బిగ్ బాస్ వేదిక పైకి వచ్చారు. తనకోసం హౌస్ నుంచి బయటకు వస్తావా అంటు నాగార్జున అడగడంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రవితేజ కోసం అమర్ హౌస్ నుంచి బయటకు రాబోయారు. దీన్నిబట్టి ఆయన రవితేజకు ఎంత అభిమానినో అర్థం చేసుకోవచ్చు.
ఇక బిగ్ బాస్ వేదికపై రవితేజ అమర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను నటించబోయే సినిమాలో తనుకు కూడా అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. అయితే తాజాగా రవితేజ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రవితేజ నటించే సినిమాలో అమర్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది ఈ క్రమంలోనే రవితేజతో కలిసి దిగినటువంటి ఫోటోని అమర సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Advertisement
ఫ్యాన్ బాయ్ మూమెంట్.. ఇలా రవితేజతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేసినటువంటి అమర్ ఈ ఫోటోకు . నా కల నెరవేరింది. నా దేవుడు నువ్వేనయ్యా. నువ్వంటే నాకు పిచ్చి, ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ పోస్ట్ చేసాడు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అమర్ లక్కీ ఛాన్స్ కొట్టేసారంటే పలువురు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.