Connect with us

Featured

అబ్బా.. తెలుగులో ఒకడున్నాడు.. అని ఇతర భాషా నటులు మాట్లాడుకున్నా ‘కోట’ నటించిన ఆ మూడు చిత్రాలు.!!

Published

on

సినిమా నాటి నుండి నేటి వరకు ఎంతోమంది కొత్త నటులను పరిచయం చేయడం జరిగింది.ఆ క్రమంలో కథానాయకులు, కథానాయికలు, ప్రతి కథానాయకులు, హాస్యాభినయ నటులు ఇలా ఎందరో, ఎందరెందరో.. సినీ పరిశ్రమలో తమదైన నటనా శైలిని కనబరుస్తూ ఒక్కోమెట్టు అధిగమిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. ఎస్.వి.రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, నిర్మలమ్మ వంటి నటీనటులు పాత్రకే వన్నెతెచ్చే వారు. అలాంటి వారి నటనతో కూడిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను వారి అభిమానులను ఎంతగానో మెప్పించాయి. అలాంటి కోవలోకి కోట శ్రీనివాసరావు వస్తారు.

కృష్ణా జిల్లాకు చెందిన ‘కోట’ ప్రారంభంలో బ్యాంకులో ఉద్యోగం చేస్తూండేవారు. నాటకాలపై అభిమానంతో వీలు దొరికినప్పుడల్లా స్టేజి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ క్రమంలో 1978 ఆ ప్రాంతంలో ‘ప్రాణంఖరీదు’ నాటకం వేస్తుండగా.. అది చూసిన నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ ఆ చిత్రాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. అలా చిరంజీవి హీరోగా ‘ప్రాణం ఖరీదు’ చిత్రాన్ని రూపొందించారు. ఇక అక్కడ నుండి మొదలైన కోట ప్రయాణం అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

ఆ తర్వాత దేవాంతకుడు, తాండ్రపాపారాయుడు, ప్రతిఘటన, వారసుడొచ్చాడు, ఖైదీ నెంబర్ 786, ఆహా నా పెళ్ళంట, శివ చిత్రాల అనంతరం.. 1991, సుమంత్ ఆర్ట్స్ బ్యానర్, కోడి రామకృష్ణ దర్శకత్వంలో శత్రువు చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో వెంకటేష్, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రతి కథానాయకుడు పాత్రలో వెంకటరత్నంగా కోట శ్రీనివాసరావు నటన డిఫరెంట్ గా ఉంటుంది. అవినీతి రాజకీయ నాయకుడి పాత్రలో కోట అదరగొట్టారు. కనిపించిన ప్రతి సన్నివేశంలో ఇలా జరిగిందేమిటిరా బాబు.. “అని చెప్పే డైలాగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. ఆ తర్వాత 1993 రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘గాయం’ చిత్రం విడుదలయ్యింది.

ఈ సినిమాలో జగపతిబాబు,ఊర్మిళ హీరో,హీరోయిన్లుగా నటించారు. స్థానిక ఎమ్మెల్యే పాత్రలో కోట శ్రీనివాసరావు గురునారాయణ్ గా నటించారు. రాజకీయ నాయకుడిగా తెలంగాణా స్లాంగ్ లో కోట శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్స్ కొత్త విలనిజాన్ని బయటకి చూపించాయి. 1998 సురేష్ ప్రొడక్షన్స్, డి.సురేష్ బాబు నిర్మాణం తిరుపతి స్వామి దర్శకత్వంలో గణేష్ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, రంభ, మధుబాల హీరో, హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు సురేష్ కృష్ణ శిష్యుడైన తిరుపతి స్వామి లోగడ విలేఖరి, ఒక అభ్యుదయవాది. ఆయన అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకున్న కథను సురేష్ బాబుకు చెప్పడంతో ఆయనకు నచ్చి తిరుపతి స్వామితో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు…

మెడికల్ మాఫియా నేపథ్యంగా సాగే కథలో.. ఆరోగ్య శాఖ మంత్రిగా సాంబశివుడు పాత్రలో కోట శ్రీనివాసరావు నటించిన తీరు.. అనన్య సామాన్యం. గణేష్ చిత్రంలో ఒక సన్నివేశంలో.. గుడ్లగూబ లాంటి కళ్ళు.. పూర్తిగా వెంట్రుకలు లేని గుండుతో కోటా కనిపించిన తీరు… ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కుప్ప తోట్లో దొరికిన.. ఎండకు ఎండిన.. వానకు తడిసిన.. 14 ఏళ్లకే హత్య చేసిన.. అంటే చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు.. నేను బతకాలి తమ్మి… అని కోట సంభాషణ చెప్పిన తీరు, ఆయన నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఉంటుంది. అందుకే ఆయన అభినయాన్ని చూసిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. గాయం, గణేష్ చిత్రాల గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట నంది పురస్కారం అందుకున్నారు. ఆయన నటనకు పరభాషా నటులు సైతం దాసోహం అన్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Supritha: తప్పకుండా మా అమ్మకు రెండో పెళ్లి చేస్తాను.. సుప్రీత కామెంట్స్ వైరల్!

Published

on

Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అయితే ఇటీవల కాలంలో సురేఖ వాణి కాస్త సినిమాలను తగ్గించారనే చెప్పాలి. ఇలా సినిమాలకు దూరమైన ఈమె తన కుమార్తెతో కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు.

Supritha: నాన్నకు తలకొరివి నేనే పెట్టా… అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత!
Supritha: నాన్నకు తలకొరివి నేనే పెట్టా… అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత!

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి గురించి తరచూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈమె త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. 2019వ సంవత్సరంలో సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించారు అప్పటినుంచి తన కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటున్నారు.

ఇలా కూతురితో కలిసి ఒంటరిగా ఉన్నటువంటి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను గతంలో ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఖండించేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత మరోసారి తన తల్లి రెండో పెళ్లి గురించి కామెంట్స్ చేశారు.

Advertisement

మంచి అంకుల్ దొరికితే..
ఈ సందర్భంగా సుప్రీత మాట్లాడుతూ తన తల్లికి రెండో పెళ్లి చేస్తానని తెలిపారు. అయితే అమ్మకు అబ్బాయిలు సరిపోరని అంకుల్స్ అయితే సరిపోతారని ఈమె తెలిపారు తనని మంచిగా చూసుకునే అంకుల్ కనుక దొరికితే తనకు రెండో పెళ్లి చేస్తాను అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Radha: ఆ పాటకు చిరుతో డాన్స్ చేయాలంటే కష్టంగా అనిపించింది: రాధా

Published

on

Radha: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాధా ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి రాధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే బుల్లితెరపై నీతోనే డాన్స్ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి రాధా ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. మీ మొదటి సినిమా చిరంజీవి గారితో ఏది అనే ప్రశ్న ఆలీ అడగడంతో రాధా సమాధానం చెబుతూ చిరంజీవి గారితో కలిసి గుండా అనే సినిమాలో మొదటిసారి నటించానని తెలిపారు.

నిజాయితీపరులు..

Advertisement

ఇక ఆయనతోపాటు నేను సమానంగా డాన్స్ చేసేదాన్ని నిర్మాతల డబ్బు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే సింగిల్ టేక్ లో ఎలాంటి స్టెప్స్ అయినా కూడా చేసేస్తానని తెలిపారు. కానీ యముడికి మొగుడు సినిమాలో అందం హిందోళం అధరం తాంబూలం పాటకి మాత్రం చిరంజీవితో పాటు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించినట్లు రాధ గుర్తు చేసుకుంది. చిరంజీవి మంచివారు మాత్రమే కాదు నిజాయితీపరులు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ డ్యాన్స్ విషయంలో పోటీ ఉండేదని ఆ పోటీ ఉన్నప్పుడే సినిమా కూడా అద్భుతంగా వస్తుందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: జరగండి పాట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా.. అయినా ఫలితం లేకుండా పోయిందా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా తర్వాత బుచ్చిబాబు అనంతరం సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో రామ్ చరణ్ బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసినటువంటి ఈ పాటను విడుదల చేయగా ఈ పాటకు అనుకున్న స్థాయిలో వ్యూస్ రాలేదని చెప్పాలి. ఈ పాట పట్ల మెగా ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

18 కోట్లు ఖర్చు..

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోకి పడాల్సిన పాట కాదు అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇక ఈ పాట కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేసిన సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!