Connect with us

Featured

స్టార్ హీరోయిన్స్ కూడా రమ్యకృష్ణ ముందు ఎందుకు సరిపోరు ఆమె ఒక్క రోజు సంపాదన ఎంతో తెలుసా??

Published

on

సినీరంగంలోకి ప్రవేశించాక ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు ఉండడం మాములు విషయమే. ఒక్కోసారి సినిమా హిట్ అవుతుంది. మరోసారి పరాజయం పాలవుతుంది. అయిన కృంగిపోకుండా ముందుకు సాగిపోతుంటారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎందుకు అనుకుంటున్నారా..? ఒకానొక సమయంలో ఎంతో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్లు ఒక్కసారిగా కిందకు పడిపోతారు. అప్పుడు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన వారు, తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గాని, హీరో తల్లిగా, హీరోయిన్ తల్లిగా, అక్కగా, వదినగా ఇలా సరిపెట్టుకోవాలిసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అప్పుడు హీరోయిన్ గా నటించిన తరువాత పెళ్లి చేసుకుని కొంతకాలం అయ్యాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే నటీమణులు చాలా మందినే ఉన్నారు. అందుకనే ఆ హీరోయిన్స్ సినిమాలో నటించే ఈ అవకాశం వచ్చినాగాని వదిలిపెట్టకుండా నటిస్తారు. అలాగే వాళ్ళ రెమ్యూనిరేషన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది.

ఇప్పుడు అలాంటి కోవలోకి చెందిన హీరోయిన్స్ లో రమ్య కృష్ణ ఒకటి. అప్పట్లో కుర్రకారును తన అందంతో ఒక ఊపు ఊపిన నటి రమ్యకృష్ణ. దాదాపు అందరి హీరోల సరసన నటించింది. తరువాత దర్శకుడు అయిన కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. తరువాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా చేసింది. అలాగే కొన్ని సినిమల్లో హీరోకి అమ్మగా, అత్తగా, అక్కగా కూడా చేసి అందరిని మెప్పించింది. అయితే రమ్యక్రిష్ణ కు ఉన్న క్రేజ్ ఇప్పటికి ఏమాత్రం తగ్గలేదు.. ఎందుకంటే ఇప్పటి హీరోయిన్స్ కి సరిసమానమైన పారితోషకం తీసుకుంటుందంటే ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రమ్యకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా బాహుబలి.. ఈ చిత్రానికి ముందు కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, అంతా పేరు, ప్రఖ్యాతలు రాలేదు. ఎప్పుడయితే ప్రభాస్ బాహుబలి సినిమాలో శివగామి లాంటి పవర్ ఫుల్ పాత్ర చేసిందో అప్పటినుండి రమ్యకృష్ణ పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. తరువాత నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయన లాంటి సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇంకేముంది ప్రతి ఒక్క దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో రమ్యకృష్ణ కావాలని క్యూ కడుతున్నారు. ఎంత పారితోషకం అయినా సరే ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే రమ్యకృష్ణ తమ సినిమాలో నటిస్తే సినిమాకు ఒక హైప్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకనే పారితోషకం విషయంలో ఆలోచించడం లేదు. ఇప్పటి హీరోయిన్స్ తీసుకునే పారితోషకానికి సమానంగా తీసుకుంటుందట. ఇక రెమ్యునిరేషన్ విషయానికి వస్తే ఒక్క రోజుకి 10 లక్షలు రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది రమ్యకృష్ణ. అంటే 10 రోజులు షూటింగ్ లో పాల్గొంటే కోటి రూపాయల దాక డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ, సాయి తేజ్ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాల్లో కూడా ఇదే స్థాయిలో పారితోషకం తీసుకుంటుందట.

ప్రస్తుత స్టార్ హీరోయిన్లు అయిన పూజ హేగ్జే, కీర్తి సురేష్, రష్మిక వంటి వారు ఒక్కో సినిమాకు ఒకటిన్నర కోటి నుండి రెండు కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నారు. ఇంకా కుర్ర హీరోయిన్లు అయిన నిధి అగర్వాల్, నభా నటేష్, పాయల్ రాజపుత్ లాంటి వారు 70 లక్షల నుండి కోటి రూపాయల దాక పారితోషకాన్ని అందుకుంటున్నారు. అయితే ఈ కుర్ర హీరోయిన్స్ కు పోటీగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు అంతా రెమ్యూనిరేషన్ తీసుకుంటుందంటే మాములు విషయం కాదు. అది ఒక్క రమ్యకృష్ణ వల్లనే సాధ్యం అయినది. అయితే రమ్యకృష్ణ సినిమాలతో పాటు ఒక జీ తెలుగులో ప్రసారమయ్యే ఒక సీరియల్ లో కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. రమ్యకృష్ణ సినిమాలో గాని, సీరియల్ ల్లో గాని నటిస్తే హిట్ అవుతుందని భావించి ఆమె అడిగినదానికల్లా సై అంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే, రమ్యకృష్ణకు ఉన్న ఫాలోయింగ్ అప్పుడయినా, ఎప్పుడయినా ఏ మాత్రం తగ్గలేదు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Radha: ఆ పాటకు చిరుతో డాన్స్ చేయాలంటే కష్టంగా అనిపించింది: రాధా

Published

on

Radha: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాధా ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి రాధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే బుల్లితెరపై నీతోనే డాన్స్ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి రాధా ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. మీ మొదటి సినిమా చిరంజీవి గారితో ఏది అనే ప్రశ్న ఆలీ అడగడంతో రాధా సమాధానం చెబుతూ చిరంజీవి గారితో కలిసి గుండా అనే సినిమాలో మొదటిసారి నటించానని తెలిపారు.

నిజాయితీపరులు..

Advertisement

ఇక ఆయనతోపాటు నేను సమానంగా డాన్స్ చేసేదాన్ని నిర్మాతల డబ్బు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే సింగిల్ టేక్ లో ఎలాంటి స్టెప్స్ అయినా కూడా చేసేస్తానని తెలిపారు. కానీ యముడికి మొగుడు సినిమాలో అందం హిందోళం అధరం తాంబూలం పాటకి మాత్రం చిరంజీవితో పాటు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించినట్లు రాధ గుర్తు చేసుకుంది. చిరంజీవి మంచివారు మాత్రమే కాదు నిజాయితీపరులు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ డ్యాన్స్ విషయంలో పోటీ ఉండేదని ఆ పోటీ ఉన్నప్పుడే సినిమా కూడా అద్భుతంగా వస్తుందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: జరగండి పాట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా.. అయినా ఫలితం లేకుండా పోయిందా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా తర్వాత బుచ్చిబాబు అనంతరం సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో రామ్ చరణ్ బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసినటువంటి ఈ పాటను విడుదల చేయగా ఈ పాటకు అనుకున్న స్థాయిలో వ్యూస్ రాలేదని చెప్పాలి. ఈ పాట పట్ల మెగా ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

18 కోట్లు ఖర్చు..

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోకి పడాల్సిన పాట కాదు అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇక ఈ పాట కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేసిన సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Rashmika: మై డార్లింగ్.. పార్టీ కావాలంటున్న రష్మిక.. రౌడీ హీరో రిప్లై ఇదే?

Published

on

Rashmika: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే రష్మిక ఒకవైపు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలు గురించి మాత్రం ఈమె స్పందించడం లేదు కానీ తరచూ వీరిద్దరూ వెకేషన్ లోకి వెళ్లడం ఒకే చోటే కలిసి పార్టీలు చేసుకోవడం వంటి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఇదిలా ఉండగా తాజాగా మై డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

Advertisement

ఆల్ ది బెస్ట్ మై లవ్..
మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురామ్ కు నా బెస్ట్ విషెస్. ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోయే ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీరు కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు నాకు పార్టీ కావాలి ఆల్ ద బెస్ట్ మై లవ్ మృణాల్ ఠాకూర్ అంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!