Connect with us

Featured

షూటింగ్ లో జరిగిన ప్రమాదంతో ఒక్కటైన అజిత్, షాలిని..వీరి లవ్ స్టోరీలో మాములు ట్విస్టులు లేవు !!

Published

on

హీరో అజిత్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వ్యక్తి ఈయన. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా వెండితెరకు పరిచయమైన తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ హోదా ను సంపాదించుకున్నాడు. ఇక ఆయన భార్య నటి షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో బాలనటిగా తన నట ప్రస్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు ఎంతో మంది ఆవిడ అభిమానులుగా మారారు అంటే అతిశయోక్తి కాదు. తన చెల్లెలుకు షామిలి తో పోటీ మరి ఆవిడ నటించేది. జగదేకవీరుడు అతిలోకసుందరి, బ్రహ్మపుత్రుడు ఇలాంటి టాలీవుడ్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల లో ఓ ముద్ర వేసుకుంది. ఈవిడ దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమలో దాదాపు 50కి పైగా సినిమాలలో బాలనటిగా నటించారు.

ఇక నటి షాలిని నటుడు అజిత్ ఒకానొక సమయంలో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమకి నాంది పలికింది ఓ సినిమా షూటింగ్ స్పాట్. ఆ సినిమా పేరు అమర్ కాలం.. 1999 లో రిలీజ్ అయిన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు హీరోహీరోయిన్ల మధ్య ఓ చిన్నపాటి యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా హీరోయిన్ షాలిని కి గాయం అయింది. అయితే ఆ గాయం పూర్తిగా తన వల్లే జరిగిందని అజిత్ తెగ ఫీల్ అయిపోయి ఆమెకు క్షమాపణ చెప్పారట. అయితే ఈ సినిమా షూటింగ్ కంటే ముందే వారిద్దరికీ పరిచయం ఉండేది.

నిజానికి ఆ సినిమాలో నటించడానికి హీరోయిన్ షాలిని ఒప్పుకోలేదట. దానికి కారణం ఆ సమయంలో ఆవిడ ఇంటర్ పరీక్షలు రాయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎలాగైనా ఆమెను నటింపచేయాలని హీరో అజిత్ స్వయంగా దర్శక నిర్మాతలను ఒప్పించి మరీ సినిమాను కొన్ని రోజుల పాటు వాయిదా వేయించాడు. అయితే ఇందుకు కారణం షాలిని అదివరకు ముందు హీరోయిన్ గా నటించిన సినిమా ‘ కధలకో మర్యాధై’ అనే సినిమాలో ఆవిడ నటనను చూసి అజిత్ ఆ సినిమాలో ఎలాగైనా శాలినిని నటింప చేయాలని నిర్ణయించుకున్నాడట. దీంతో శాలిని ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక అమర్ కాలం సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. అయితే ఆ సమయంలో అజిత్ నటించిన సినిమా సంబంధించి ప్రీమియర్ షో కు నటి షాలిని ప్రత్యేకంగా ఆహ్వానించారట.

అయితే ప్రీమియర్ షో కి షాలిని కర్లీ హెయిర్ తో రావడం అజిత్ కు నచ్చలేదట. దీంతో ఆయన వెంటనే షాలిని తో నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు. మీకు కర్లీ హెయిర్ అంతగా బాగోలేదు ఇదివరకు సినిమాలో తన లుక్ గురించి చెబుతూ అందులో ఎంత బాగున్నారు అంటూ తెలిపాడు. ఈ విషయాలను ఆయన మొహమాటం లేకుండా ఆవిడతో చెప్పడంతో ఒకింత షాక్ కు గురైన.. ఆ తర్వాత ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు ఆయనపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అయితే అమర్ కాలం అనే సినిమాలో హీరోయిన్ కు జరిగిన చిన్న సంఘటన అయినా ఆ తర్వాత ఆయన ఆమెను కంటికి రెప్పలా కాపాడుకొనే వారట. చాలా బాగా కేర్ తీసుకునేవాడట. ఇలాంటి సమయంలోనే అజిత్ సమయంలో హీరోయిన్ షాలిని కి తాను ప్రేమిస్తున్నట్లు మనసులో మాట చెప్పాడట. తొలుత షాలిని ఈ విషయం సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఆ తర్వాత రోజుల్లో అజిత్ ని ప్రేమించడం మొదలు పెట్టింది. దీంతో ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. కాకపోతే అప్పటికే ఆవిడ ఒప్పుకున్న సినిమాలు అన్ని పూర్తి చేసుకుని అజిత్ ను వివాహం చేసుకుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!