Connect with us

Featured

హీరో కొట్టిన దెబ్బతో కన్ను పోయింది.. కన్ను మూసిన 2 రోజులకు ఇంట్లో వాళ్ళు గుర్తించిన దేశం గర్వించే నటీమణి!

Published

on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదివరకు కఠినమైన అత్తగా ఎన్నో మరుపురాని పాత్రలు పోషించిన వ్యక్తిగా సూర్యకాంతం ఎలాంటి పాత్రలు పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అలాంటి క్యారెక్టర్స్ బాలీవుడ్ లో పోషించిన వ్యక్తి లలితా పవర్. భారతదేశ టెలివిజన్ చరిత్రలో ఎన్నో మరపురాని ఘట్టాలను నమోదు చేసిన రామాయణం సీరియల్ లో మందార పాత్రను ఆవిడ అద్భుతంగా పోషించారు. అది ఎంతలా అంటే రాముడిని అడవులకు పంపించిన నేపథ్యంలో ఆ సీరియల్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ ఆవిడ పై కక్ష పెంచుకునేలా ఆవిడ నటనను ప్రదర్శించింది అంటే ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం విలన్ పాత్రలను మాత్రమే కాకుండా అమ్మ, అలాగే ఇంట్లోనే ఉన్న వ్యక్తిగా ఇలా ఏ పాత్ర వేసినా పూర్తిగా అందులో ఒదిగిపోయి క్యారెక్టర్ చేసే వ్యక్తిగా ఆవిడ పేరు తెచ్చుకున్నారు.

ఈవిడ అసలు పేరు అంబిక. ఈవిడ సొంత ఊరు ఇండోర్. ఇక ఈ వీడియో చిన్న వయసులోనే వారి కుటుంబం పూణే నగరానికి చేరుకున్నారు. తన ఏడు సంవత్సరాలు ఉన్న సమయంలో పూణే నగరంలో ఉన్నప్పుడు వారు ఉన్న ఏరియాలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమాచారం అందుకున్న ఆవిడ వెంటనే పరుగు తీసి ఆ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పోయింది. అక్కడికి వెళ్లి షూటింగ్ చేస్తున్న సమయంలో ఆ సినిమా దర్శకుడి కంట ఆ చిన్న అమ్మాయి పడింది. దీంతో ఆవిడ ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను పోషించింది. అయితే అది కేవలం మూకీ సినిమా మాత్రమే. దీంతో ఆవిడ సినీ ప్రస్థానం మొదలైంది. 1928 సంవత్సరంలో ఉమెన్ అనే మూకీ సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టింది. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడకుండా టాకీ మొదలైనప్పుడు కూడా అనేక సినిమాలను చేసింది. అయితే సినిమాల్లోకి వచ్చాక అంబిక అనే పేరును లలిత గా మార్చుకుంది. ఒకానొక సమయంలో బాలీవుడ్ లో లలిత సినిమా లో ఉంటే భారీ హిట్ సాధిస్తుందని హీరోలు అలాగే దర్శక నిర్మాతలు భావించారు.

అయితే హీరోయిన్ గా ఆవిడ టాప్ హీరోయిన్ గా సమయంలో ఆవిడకు ఓ దారుణ సంఘటన ఎదురైంది. దీంతో ఆవిడ జీవితం పూర్తిగా మారిపోయింది. 1942 లో భగవాన్ అనే కొత్త యాక్టర్ తో కలిసి నటిస్తున్న సమయంలో సినిమా షూటింగ్ లో నేపథ్యంలో హీరో హీరోయిన్ ని ఓ చెంపదెబ్బ కొట్టాలి. అయితే హీరో కొత్త వ్యక్తి కావడంతో దెబ్బలు ఎలా కొట్టాలో తెలియకపోవడంతో నిజంగానే అతడు చెంప దెబ్బను చాలా గట్టిగా కొట్టాడు. దీంతో లలితా పవర్ సినిమా సెట్టింగ్ లోనే కళ్లు తిరిగి పడిపోయింది. ఆ దెబ్బకు ఆవిడకు కంట్లోని నరం చిట్లింది. అలాగే ముఖానికి పాక్షికంగా పక్షవాతం కూడా వచ్చింది. ఆవిడ పరిస్థితుల నుంచి కూడా మూడు సంవత్సరాల సమయం పట్టింది. అలా మూడు సంవత్సరాల తర్వాత చూస్తే ఆవిడ ఎడమ కన్ను పూర్తిగా ఓ మెల్లకన్ను లాగా మారిపోయింది. దీంతో ఆవిడకి హీరోయిన్ ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో లలిత హీరోయిన్ పాత్రలకు పనికిరాకుండా పోయారు. అయితే పరిస్థితులు బాగా ఉన్న సమయంలో సినీ నిర్మాత గణపతి రావు పవర్ ను పెళ్లి చేసుకుంది. అయితే కొద్దీ కాలానికే తన భర్త చెల్లితో సంబంధం కొనసాగించడంతో ఆవిడ ఆయనతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరో నిర్మాత రాజ్ కుమార్ గుప్తా రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, హీరోయిన్ స్థాయి పోవడంతో ఆవిడ దిగులు చెందకుండా 1960 దశకంలో వచ్చిన సినిమాలలో ఆవిడ ఎన్నో మరుపురాని పాత్రలు పోషించింది.

కొన్ని సినిమాలలో క్రూరమైన అత్తగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. అలా 1960 దశకం నుండి 1990 దశకం వరకు ఆవిడ వివిధ సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ వేస్తూ తన జీవితం కొనసాగింది. 1990లో వచ్చిన భాయ్ అనే సినిమా ఆవిడ కు చివరి సినిమా. 1942 లో జరిగిన కంటి సంఘటన తన నట జీవితానికి దాదాపు 50 సంవత్సరాలపాటు వేదనకు గురి చేసింది. కంటి లోపల నరాలు చిట్లి పోవడంతో కంటి చూపు చాలా వరకు తగ్గి, అలాగే భయంకరమైన నొప్పి కూడా ఆమె అనుభవించేది. దీంట్లో ఒకానొక సమయంలో ఆవిడకు షూటింగ్ లో వేసి లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల ఆవిడ ఇబ్బందులు ఎదుర్కోలేక సినిమాలు చేయలేక అనేక సమస్యలను ఎదుర్కొనేవి. దీంతో ఆవిడ సినిమా దర్శకుల నుంచి ఆఫర్స్ అందుకున్న కానీ వారికి నో చెప్పడానికి కష్టంగా ఉండటంతో చివరకు ఆవిడ బొంబాయి నగరం నుండి వదిలి పూణే నగరానికి చేరుకుంది. అప్పటికే ఆవిడకు 77 సంవత్సరాలు వచ్చాయి. దీంతో ఆవిడ కెరియర్ పూర్తిగా ముగిసిందని చెప్పవచ్చు. పూణే నగరానికి చేరుకున్న తర్వాత ఆవిడను ఎవరు పట్టించుకునే వారు కూడా కాదు. ఆ కుటుంబంలో భర్త, కొడుకు కోడలితో ఒక అందమైన జీవితాన్ని మొదలు పెట్టింది. ముంబై నగరం వదిలి రావడంతో ఆమె కు పూర్తిగా పలకరించేవారు కూడా కరువయ్యారు. అయితే ఆ వయసులో కూడా తన భర్తకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మాత్రమే ముంబై నగరానికి ఆవిడ వచ్చేది.

చివరికి ఆవిడ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి తన భర్త ముంబై నగరానికి వచ్చి చికిత్స కోసం నాలుగైదు రోజులు ఉండాల్సిన పరిస్థితి కూడా ఉండేది. ఆ సమయంలో ఒంటరిగా ఆవిడ పూణే నగరంలో ఇంట్లో జీవనం కొనసాగించింది. ఆ సమయంలో ఆవిడ తలుపు తీసి బయటకు కూడా వచ్చే వ్యక్తి కాదు. అలా తన భర్త ఒక సారి తన చికిత్స కోసం ముంబై నగరానికి వెళ్లి రెండు రోజుల తర్వాత వచ్చి చూడడంతో ఇంట్లో విగత జీవిగా పడి ఉండటం ఆయన గమనించారు. దీంతో ఆవిడను పరీక్షించడానికి వచ్చిన వైద్యులు ఆవిడను పరీక్షించి ఆమె చనిపోయిన దాదాపు రెండు రోజులు అయి ఉంటుందని వారు తేల్చారు. నీ జీవితంలో తన ఒంటరి ప్రయాణం కు అలవాటు పడిన ఆవిడ ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడంతో చివరికి తన ఇంట్లోనే ఎవరు లేని సమయంలో ఎన్ని ఇబ్బందులు నడుమ ఆవిడ కన్నుమూసింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!