ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కొందరు ఏడాదికి 4-5 సినిమాలకి డేట్స్ ఇస్తేనే ఇక మా వద్ద డేట్స్ లేవు. మీ సినిమాకి డేట్స్ ఇవ్వాలంటే ఓ సంవత్సరం ఆగాల్సిందే అంటూ కథలు చెప్తుంటారు. భాష ఏదైనా ఒకే సంవత్సరం నాలుగు నుంచి ఆరు సినిమాలు చేస్తే మహా గొప్పగా చెప్పుకోవచ్చు. హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా కొంతమంది ఏడాదికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలంటే నానా హయరానా పడుతున్నారు. పాన్ ఇండియన్ సినిమా అంటూ సినిమా కోసం కనీసం రెండేళ్ళ సమయం తీసుకుంటున్నారు. అయితే అప్పటి హీరోలు హీరోయిన్లు ఏకంగా సంవత్సరానికి 10 సినిమాలకి పైగానే నటించిన వారున్నారు.
మూడు షిఫ్టుల్లో మూడు సినిమాలలో నటించి 10 కి పైగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన నటీ నటులున్నారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో మూడు షిఫ్టుల్లో పనిచేసి పదుల కొద్ది తమ సినిమాలను రిలీజ్ చేశారు. వీరిలో ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ యావరేజ్గా సంవత్సరానికి 90 నుంచి 100 సినిమాలు రిలీజ్ చేయడం గొప్ప విషయం. 10 ఏళ్ళపాటైతే ఇలా మూడు షిఫ్టుల్లో పని చేసి సినిమాలను వదిలారు. ఇదీ ఇప్పటికీ ఓ గొప్ప రికార్డ్గా నిలిచింది.అయితే అప్పట్లో హీరోలు మాత్రమే మూడు షిఫ్టుల్లో నటించడం కాదు హీరోయిన్స్ కూడా మూడు షిఫ్టుల్లో సినిమాలు చేసిన వారున్నారు.
అలాంటి వారిలో అందమైన హీరోయిన్, మంచి పర్ఫార్మర్ గా పేరు సంపాదించుకున్న కృష్ణకుమారి ఒకరు. ఆమె అనుకోకుండా సినిమాలలోకి వచ్చి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. కృష్ణకుమారి తల్లితో కలిసి స్వప్నసుందరి సినిమా చూసేందుకు వెళ్ళిన సందర్భంలో అక్కడకి సౌందరరాజన్ గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చారట. సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆవిడ ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమా కోసం కథానాయికని వెతుకుతున్నారు. ఈ సినిమాకి మీరైతే బావుంటారని చెప్పారట. అలాగే ఆ తర్వాత రోజు దర్శక, నిర్మాతలు కృష్ణకుమారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఇందులో హీరోయిన్గా ఎంచుకున్నారు.
అయితే కృష్ణకుమారి నటించిన మొదటి సినిమా విడుదల కాకుండానే ఆమె అందం, చలాకీతనం చూసి ఏకంగా 14 సినిమాలలో నటించే అవకాశం కల్పించారట. దీని కారణం మంత్రదండం అనే సినిమా. కృష్ణకుమారి మొదటి సినిమా ‘నవ్వితే నవరత్నాలు’ విడుదలకంటే ముందే మంత్రదండం విడుదలైంది. ఇందులో ఆమె నటన అద్భుతంగా ఉందని అందరూ చెప్పుకున్నారు. దాంతో కృష్ణకుమారి వరుసబెట్టి 14 ప్రాజెక్ట్స్లో అవకాశం అందుకున్నారు. ఇలా కెరీర్లో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. 25 ఏళ్ళకి పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగిన కృష్ణకుమారి 150 సినిమాలకి పైగా నటించారు.
1963లో ఒకే ఏడాదిలో ఏకంగా 16 సినిమాలలో హీరోయిన్గా నటించడం ఓ రికార్డ్. మూడు షిఫ్టుల్లో పనిచేసిన హీరోయిన్స్లో కృష్ణకుమారి ముందు వరుసలో ఉంటారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన ఆమె మూడు జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు దక్కించుకున్నారు. కాంతారావుతో కలిసి 28 జానపద చిత్రాల్లో నటించడం విశేషం. ఇక బాలీవుడ్ లో కిశోర్ కుమార్ తో కలిసి ఒకే ఒక సినిమాలో హీరోయిన్గా నటించారు. హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి రతి అనే పేరుతో పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సొంతగా ఆమె డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.