Connect with us

Featured

Narendra Modi: నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగిన ఇటలీ పిఎం జార్జియా మెలోని!

Published

on

Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా దుబాయిలో జరిగినటువంటి వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్.. కాన్ఫెరెన్స్ ఆఫ్‌ పార్టీస్‌ (COP28) 28వ సమ్మిట్ కు హాజరైన సంగతి మనకు తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, యూకే ప్రధాని రిషి సునక్‌, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సహా ప్రపంచ నేతలంతా కూడా హాజరయ్యారు.

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వాతావరణ మార్పులపై కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగారు. ఇక ఈ ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె COP28లో గుడ్ ఫ్రెండ్స్.. #Melodi” అంటూ ఇటాలియన్ ప్రధాని మెలోని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

COP28 సమ్మిట్ లో పాల్గొన్న మోడీ…

మోదీ ఇటాలియన్ కౌంటర్‌ గురించి మెలోని ప్రస్తావించారు. స్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం రెండు దేశాల ప్రయత్నాల గురించి మాట్లాడారు. అదేవిధంగా సుస్థిరమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం భారతదేశం, ఇటలీల మధ్య సహకార ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. COP28 సమ్మిట్ UAE ప్రెసిడెన్సీలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు జరగనుంది. శుక్రవారం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని తిరిగి ఇండియా చేరుకున్నారు.

Advertisement

Advertisement

Featured

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్..హింట్ ఇచ్చిన తమన్ సంతోషంలో అభిమానులు!

Published

on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ramcharan Tej) చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన మరో స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.

Advertisement

ఎన్నో సందర్భాలలో దర్శక నిర్మాతలను ట్యాగ్ చేస్తూ అభిమానులు ఈ సినిమా గురించి అప్డేట్స్ అడిగినప్పటికీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్(SS Thaman) రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా విడుదల గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా సినిమాకు సంబంధించిన వరుస ఈవెంట్స్ జరుగుతాయని అభిమానులు రెడీగా ఉండాలి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి మొదలు కానుంది. సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ ఛేంజర్ సినిమాకు వరుసగా ఈవెంట్స్, సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఉంటాయి. రెడీ గా ఉండండి. వచ్చేవారమే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ రాబోతుంది అంటూ ఈయన వెల్లడించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు(Dil Raju) క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని చెప్పిన తేదీ మాత్రం చెప్పలేదు. కానీ తమన్ మాత్రం 20వ తేదీ విడుదల కాబోతుందని చెప్పకనే చెప్పారు అయితే ఈ విడుదల తేదీ గురించి త్వరలోనే అధికారక ప్రకటన ఇవ్వనున్నారు.

Advertisement
Continue Reading

Featured

సింపుల్ గా కనిపిస్తున్న సిద్దార్థ్ పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

Published

on

సినీనటుడు సిద్దార్థ్ (siddarth) ఇటీవల మరోసారి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈయన నటి అదితి రావు హైదరి(Aditi Rao Hydari) తో మరోసారి ఏడడుగులు నడిచారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే సెప్టెంబర్ 16వ తేదీ వీరి వివాహం వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే వీరి వివాహం జరిగింది.

Advertisement

ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలలో సిద్దార్థ్ ధరించిన వాచ్ (Watch) అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రౌన్ బెల్ట్, గెల్డెన్ వాచ్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. సిద్ధార్థ్ ధరించిన గోల్డ్ కేస్‌తో కూడిన ఆడెమర్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ వాచ్‌ ధర రూ.27.62 లక్షలు అని సమాచారం. సింపుల్ గా కనిపిస్తున్న ఆ వాచ్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.

సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం కానీ సిద్దార్థ్ కట్టిన ఈ వాచ్ చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ధర మాత్రం భారీ స్థాయిలో ఉండడంతో నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక వీరిద్దరికీ మొదట పరిచయం మహాసముద్రం సినిమా సమయంలో జరిగిందని అప్పుడే వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నట్టు అదితి పలు సందర్భాలలో తెలిపారు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి నిజ జీవితంలో కూడా ఒకటయ్యారు. ఇక వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడంతో నేటిజన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Kumari Aunty: వరద బాధితులకు అండగా కుమారి ఆంటీ.. ఎంత సాయం చేశారో తెలుసా?

Published

on

Kumari Aunty: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి మనకు తెలిసినదే.  తెలంగాణలో ఖమ్మం ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం వరదలలో మునిగిపోయింది. ఇలా పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఎంతోమంది ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలను అందజేస్తూ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇప్పటికీ ఎంతోమంది విరాళాలు అందజేస్తూనే ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చెక్ అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా స్టార్ కుమారి ఆంటీ సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని కలిశారు.

Advertisement

ఈ సందర్భంగా ఈమె వరద బాధితులకు తనవంతు సహాయంగా కొంత డబ్బును విరాళంగా అందించారు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో కుమారి ఆంటీ (Kumari Aunty) ఒకరు. ఈమె అతి తక్కువ ధరకే ఎన్నో రకాల ఆహార పదార్థాలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబర్స్ అలాగే ఫుడ్ వ్లాగర్స్ వెళ్లి ఈమెను మరింత ఫేమస్ చేశారు. ఇలా రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని కుమారి ఆంటీ భారీగా సంపాదించడమే కాకుండా ఇదే క్రేజ్ తో పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా కనిపించి సందడి చేశారు.

ఇలా వ్యాపారంలో మంచి సక్సెస్ అందుకున్న కుమారి ఆంటీ తన మంచి మనసును చాటుకున్నారు వరదల (Floods) కారణంగా అతలాకుతులమైనటువంటి తెలంగాణకు ఈమె తన వంతు సహాయంగా 50 వేల రూపాయల విరాళం అంద చేశారు. ఈ 50,000 రూపాయలు చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. దీంతో ఈమె మంచి మనసు పై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశంసలు రావడమే కాకుండా ఎంతోమంది గొప్పవారు కూడా చేయని సహాయం కుమారి ఆంటీ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!