YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా జగన్ ఓటమిని ఎంతోమంది సామాన్య ప్రజలు అంగీకరించడం లేదు. ఏదో మోసం జరిగి ఉందని ఈవీఎం ట్యాంపరింగ్ చేసే కూటమి అధికారంలోకి వచ్చిందని లేకపోతే అంత మెజారిటీ రాదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికి సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు ఈ విషయంపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో 11 సీట్లకు పరిమితం అయ్యే అంత చెత్త పాలన చేయలేదని ఈయన రాష్ట్రానికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఏక కంఠంతో చెబుతున్నారు.
ఇలా ఈవీఎంలను ట్రాప్ చేసి మరీ భారీ మెజారిటీతో గెలుపొందారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై ఎక్కడ స్పందించలేదు. తాజాగా ఈయన ఈవీఎంల గురించి చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని తెలిపారు.
బ్యాలెట్ తో ఓటింగ్..
ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలుబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ట్వీట్ పై చాలా మంది 2019 వ సంవత్సరంలో కూడా మీరు అలాగే గెలిచారా అంటూ కామెంట్ లు చేస్తున్నారు కానీ 2019 ఐదు సంవత్సరాల పాలనలో జగన్ పట్ల ఈ స్థాయిలో వ్యతిరేకత ఎక్కడ కనిపించలేదంటూ మరికొందరు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు.





























