వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతం మాదిరిగా ఆయనలో ఉన్న దూకుడు తగ్గి, ఒక రకమైన బెదురు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలు, ముఖ్యంగా మద్యం కుంభకోణం దర్యాప్తు వేగం, ఆయనలో ఈ మార్పుకు కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కొత్త లుక్తో, నుదుటిపై సింధూర తిలకం పెట్టుకొని కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గడ్డంలో తెల్ల వెంట్రుకలు మరింత స్పష్టంగా కనిపించడంతో, ఈ మార్పు చర్చనీయాంశమైంది.

సింధూర తిలకంతో సమావేశానికి: ఆశ్చర్యపరిచిన జగన్
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 30 మందికి పైగా నేతలతో ఏర్పాటు చేసిన ఈ జంబో కమిటీతో చర్చలు జరిపారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అవుతారన్న ప్రచారం మధ్య, పార్టీ శ్రేణుల మానసిక స్థితి తెలుసుకోవడమే ఈ సమావేశం ఉద్దేశం. అయితే ఆయన సింధూర బొట్టుతో అకస్మాత్తుగా సమావేశానికి రావడం నేతలను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఆలయాల సందర్శన సమయంలో మాత్రమే అలా కనిపించే జగన్, ఈసారి పార్టీ కార్యక్రమంలోనూ అలా కనిపించడం గమనార్హం. సమాచారం ప్రకారం, క్లిష్ట సమయంలో ఉన్నందున ఓ మహిళా నేత ఆయనకు సింధూరం పెట్టగా, జగన్ కూడా అంగీకరించారని చెబుతున్నారు.
హిందుత్వ వ్యతిరేక ముద్ర, రాజకీయ నష్టం
జగన్పై హిందూ సంప్రదాయాలను గౌరవించరన్న విమర్శలు కొత్తవి కావు. ఆయన పాలనలో అన్యమత ప్రభావం ఎక్కువైందని, తిరుమల సహా అనేక హిందూ ఆలయాల్లో మార్పులు వచ్చాయని గతంలో విమర్శలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో ఈ ముద్ర పెద్దగా ప్రభావం చూపకపోయినా, 2024 ఎన్నికల్లో మాత్రం హిందుత్వ వ్యతిరేక ముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గణనీయ నష్టాన్ని కలిగించింది.
రాజకీయ వ్యూహంలో మార్పు?
దీని తర్వాతే జగన్లో ఈ మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. 2024 సంక్రాంతి వేడుకలను సీఎం హోదాలో భారీ సెట్స్ వేసి నిర్వహించడం, ఇప్పుడు సింధూర తిలకంతో ప్రజల్లోకి వెళ్లడం ఇవన్నీ హిందుత్వ వ్యతిరేక ముద్రను తొలగించుకోవడానికేనని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వ్యూహం జగన్కు ఎంతవరకు రాజకీయ లాభం చేకూరుస్తుందో చూడాలి.
YSRCP is launching a new app soon !
— YS Jagan Trends (@YSJaganTrends) July 29, 2025
– @ysjagan
pic.twitter.com/Eke6PlrvmN





























