Janasena star Campinger: పవర్ స్టార్ పవన కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత ఈయన పలు సందర్భాలలో ఎన్నికలలో పోటీ చేస్తున్న ఇప్పటివరకు సరైన విజయమందుకోలేదు కానీ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కంకణం కట్టుకున్నారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన పార్టీని టిడిపితో పొత్తు కలుపుకొని ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కథ ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేస్తారు. అయితే ఈసారి మాత్రం పిఠాపురంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ సినీ నటుడు కావడంతో ఎంతో ముందే సినీ సెలెబ్రెటీలు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధికారకంగా తన పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు.
జనసేన ప్రచార కార్యకర్తలుగా పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ- టీవీ నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, జబర్దస్త్ హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరిస్తారని వెల్లడించారు.
జనసేన ప్రచార కార్యక్రమాలు..
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. ఇక త్వరలోనే వీరందరూ కూడా తమ సినిమా పనులను పక్కనపెట్టి మరీ జనసేన ప్రచార కార్యక్రమాలలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.



























